టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం, ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ లోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించగా, మరో ఇధ్దరు గాయపడ్డారు.
జమ్ము:ఓ టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ఓ టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించాడు.మరో ఇద్దరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.
రోజు వందలాది వాహనాలు జమ్ముకాశ్మీర్ లోని టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘటనలో రెండు కార్లు ద్వంసమయ్యాయి. ఓ టోల్ గేట్ ఉద్యోగి ప్రాణాలను కోల్పోయాడు.
జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది..సిసీ టీవి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

టోల్ ఫీజు చెల్లించేందుకు రెండు కార్లు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నాయి. ఈ రెండు కార్ల యజమానులు టోల్ పీజు చెల్లిస్తున్నారు.మరో వైపు ఈ టోల్ ఫీజు చెల్లించే సమయంలోనే వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది.
టోల్ పీజు చెల్లిస్తున్న రెండు కార్లను ఢీకొట్టుకొంటూ వేగంగా వెళ్ళింది.అదే సమయంలో అక్కడే ఉన్న టోల్ గేట్ ఉద్యోగి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
టోల్ గేట్ నుండి కొంత దూరం రెండు కార్లను ఈడ్చుకొంటూ వెళ్ళి ట్రక్కు ఆగిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications