ఒళ్లు మండి.. లోదుస్తులపై జయలలిత ఫోటో: ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను లోదుస్తుల పైన వేసినందుకు ఓ టెక్స్టైల్ దుకాణ యజమానిని కారైకుడి పోలీసులు అరెస్టు చేశారు. అతను జయలలిత ఫోటోను లోదుస్తుల పైన అతికించి, దానిని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపించాడు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఫొటోను లోదుస్తులపై ముద్రించడంతో అందరూ అవాక్కయ్యారు. కారైకూడిలో శరవణన్ అనే వ్యక్తి ఓ టెక్స్టైల్స్ దుకాణాన్ని నడుపుతున్నాడు. లోదుస్తులపై ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలను ముద్రించి వాటి ఫొటోలను స్నేహితులకు పంపించాడు.

ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ నేతలు అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే టౌన్ సెక్రటరీ ఎస్ మీయప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సెక్షన్ల కింద శరవణ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అతనిని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయం బయటపడింది. చెన్నై వరద బాధితులకు అందించే సాయం పైన జయలలిత ఫొటో ఉండాలని అన్నాడీఎంకే కార్యకర్తలు పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఒళ్లు మండిన శరవణన్ ఈ పని చేశాడు. శరవణన్ చేసిన పనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేదని పోలీసులు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications