సెల్ఫీ దిగుతుండగా.. భార్యను కెనాల్ లోకి తోసి..
మీరట్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తోన్న ఓ భర్త, ఒక కెనాల్ పక్కన నిలబడి తన భార్య సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆమెను అందులోకీ తోసేసి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి సమీపంలో ఉన్న సర్ధానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అయేషా (24) అనే ఒక వివాహితను భర్త ఆఫ్తాబ్ (30) గంగానదిలోకి తోసి చంపేశాడు. అంతా జరిగాక ఏమి ఎరుగనట్టు తన 8 ఏళ్ల కొడుకును తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన ఆఫ్తాబ్ ఐదుగురు దుండగులు తమపై దాడి చేసి అయేషాను పక్కనే ఉన్న కెనాల్ లోకి తోసేశారని ఫిర్యాదు చేశాడు.

ఆఫ్తాబ్ చెప్పిన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను పరిశీలించిన పోలీసులకు ఆఫ్తాబ్ చెప్పిన విషయాలపై నమ్మకం కలగలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో భాగంగా నిజం ఒప్పేసుకున్న ఆఫ్తాబ్, భార్య అయేషాను తానే కెనాల్ లోకి తోసి చంపేసినట్టుగా అంగీకరించాడు.
కాగా, అయేషా ఆఫ్తాబ్ జంటకు ఏడాదిన్నర క్రితం వివాహాం జరిగింది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, అదనపు కట్నం కోసమే ఆఫ్తాబ్ భార్యను హతమార్చినట్టుగా ప్రాథమిక సమాచారం. కట్నం వేధింపులతోనే అయేషాను హత్య చేసినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications