మోడీపై నీచ్ ఆద్మీ వ్యాఖ్యలు: రాహుల్ ట్వీట్, దిగొచ్చిన అయ్యర్
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు నేత మణిశంకర్ అయ్యర్ కొత్త వివాదానికి పురుడు పోశారు. ప్రధాని నరేంద్ర మోడీపై మర్యాదరహితమైన పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు.
మోడీని నీచ్ ఆద్మీ అని ఆయన అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. "మఝకో లగ్తా హై కి యె ఆద్మీ బహుత్ నీచ కిసమ్ కా ఆద్మీ హై, ఇస్మే కోయి సభ్యత నహీ హై. ఆర్ ఐసే మౌకే పర్ ఇస్ కి గాండీ రాజ్నీతి కర్నే కి క్యా ఆవశ్యకతా హై?" అని మణిశంకర్ అయ్యర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

మోడీ ఇలా స్పందించారు...
"వారు నన్ను నీచ్ (అధమ) అని పిలువవచ్చు. కానీ పని చాలా ఊంచ్ (ఉన్నతం)" అని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో అన్నారు. గుజతార్ సమాధానం చెప్తుందని ఆయన అన్నారు. తాను సమాజంలోని పేదవర్గం నుంచే వచ్చానని అంటూ తాను పేదలు, దళితులు, గిరిజనులు, ఓబిసీల కోసమే ప్రతి క్షణం పనిచేస్తానని, వారేం మాట్లాడుతారో మాట్టాడనీయండి, మన పని పని చేసుకుపోదామని ఆయన అన్నారు.

ఇంకా ఇలా అన్నారు..
ప్రధాని నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యలతో సరిపుచ్చకుండా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెసు విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని, అది కులాలను తక్కువ చేసి చూస్తుందని, ఉన్నత, దిగువ కులాలంటూ మాట్లాడుతుందని ఆయన అన్నారు.

అయ్యర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ
అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ స్పందించారు. అయ్యర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ, ప్రధాని తప్పుడు మాటలు ఉపయోగిస్తూ కాంగ్రెస్ను నిత్యం విమర్శిస్తుంటారని, అది వారి సంస్కారంమని, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సంస్కారం, వారసత్వం ఉందని అన్నారు. మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీని సంబోధించిన తీరును తాను సమర్థించబోనని, కాంగ్రెస్ పార్టీ, తాను కూడా వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామని రాహుల్ ట్వీట్ చేశారు.

దిగివచ్చిన అయ్యర్
రాహుల్ గాంధీ సూచన మేరకు మణిశంకర్ వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని అంటూ అందుకు మన్నించాలని కోరారు. హిందీ తన మాతృభాష కాదని, తన మాటలకు వేరే అర్థం వస్తే తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications