Manipur Opinion Poll: 41 శాతం ఓట్ షేర్‌తో తిరిగి అధికారంలోకి బీజేపీ, కాంగ్రెస్‌కు 30శాతం

ఇంఫాల్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో పలు మీడియా ఛానళ్లు ఓపీనియన్ పోల్స్ వెలువరిస్తున్నాయి. తాజాగా, జీ న్యూస్ ఓపీనియన్ పోల్స్ తన ఫలితాలను విడుదల చేసింది. కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బీజేపీనే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో రెండు దశల్లో జరగనున్న ఓటింగ్‌కు ముందు ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకునేందుకు నిర్వహించిన జీ న్యూస్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ 41% ఓట్లతో ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండవ ఎమర్జింగ్ ప్లేయర్ 30% ఓట్ షేర్‌తో కాంగ్రెస్ నిలిచింది.

సీట్ల వాటా విషయానికొస్తే, జీ న్యూస్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. కాషాయ శిబిరం 33-37 సీట్లను కైవసం చేసుకుంటుందని అంచనా. ఇక, కాంగ్రెస్‌కు 13-17 సీట్లు, ఎన్‌పీఎఫ్‌కు 4-6 సీట్లు, ఎన్‌పీపీకి 2-4, ఇతరులకు 0-2 సీట్లు రావచ్చు.

 Manipur Opinion Poll 2022: BJP expected to dominate with 41% vote share, Congress to follow with 30%

జీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం, 2017 ఓట్ షేర్ కంటే 5% పెరుగుదలతో బీజేపీకి పెరుగుతున్న ట్రెండ్‌ను చూడవచ్చు.

ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఒపీనియన్ పోల్.. మణిపూర్ వయోజన జనాభాలో 33% మంది బీజేపీకి చెందిన ఎన్ బీరెన్ సింగ్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, 19% మంది కాంగ్రెస్‌కు చెందిన ఓక్రమ్ ఇబోబి సింగ్‌ను సీఎంగా కోరుకుంటున్నారని తెలిపింది.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీలలో 2 దశల్లో నిర్వహించబడతాయి. మార్చి 10 న ఫలితాలు ప్రకటించబడతాయి.
ప్రస్తుత మణిపూర్ శాసనసభ పదవీకాలం మార్చి 19తో ముగుస్తుంది. మణిపూర్‌లో ప్రస్తుతం అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నోంగ్‌తోంబమ్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

అభిప్రాయ పోల్‌లను నిర్వహించే పోర్ట్‌ఫోలియోతో రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ - డిజైన్ బాక్స్‌డ్‌తో కలిసి జీ న్యూస్ సంయుక్తంగా ఈ అభిప్రాయ సేకరణను నిర్వహించింది. నమూనా పరిమాణం పరంగా, ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద అభిప్రాయ సేకరణ.

Recommended Video

    Assembly Elections 2022 Schedule For 5 States | Election Commission | Oneindia Telugu

    గోవా, మణిపూర్‌తో పాటు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లోని ఇతర రాష్ట్రాల ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి జీ న్యూస్ అభిప్రాయ సేకరణను నిర్వహించింది.
    'జనతా కా మూడ్' - ఇప్పటివరకు అతిపెద్ద అభిప్రాయ సేకరణగా పేర్కొనబడింది.. ఐదు రాష్ట్రాల ప్రజల నుంచి 12 లక్షలకు పైగా స్పందనలు వచ్చాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+