Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ‌ నేత మనీశ్ సిసోడియా శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.

రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో సిసోడియాను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఢిల్లీ మనీశ్ సిసోదియా శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌​పై విచారణ సందర్భంగా జస్టిస్‌ బీఆర్ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Manish Sisodia released from Tihar Jail after SC grants bail

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా గత 17 నెలలుగా జైలులో ఉన్నారని, ఇంకా ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో బెయిల్ కోరిన మనీశ్‌​ను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంది. 'బెయిల్‌ అనేది నియమం- జైలు మినహాయింపు' అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

కాగా, మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సత్యాన్ని దక్కిన విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జైలులో ఉన్న పార్టీకి చెందిన ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 'ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ కు బెయిల్ లభించడం వల్ల ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉంది. గత 530 రోజులుగా సిసోడియాను జైల్లో ఉంచారు. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే మనీశ్ చేసిన నేరమా?' అని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా కేంద్రంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.

మరోవైపు, మనీశ్ కు బెయిల్ రావడాన్ని ఢిల్లీ మంత్రి అతీశీ స్వాగతించారు. 'ఈరోజు నిజం గెలిచింది. ఢిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు మంచి చదువు అందించినందకే మనీశ్​‌ను జైల్లో పెట్టారు' అని కేంద్రంపై అతీశీ మండిపడ్డారు. ఈ సందర్బంగా కొంత భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టుకున్నారు. కాగా, సిసోడియా జైలు నుంచి విడుదలవడంతో ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగమే తనను రక్షించిందంటూ సిసోడియా జైలు నుంచి విడుదలైన సందర్భంగా వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన సిసోడియా.. నేరుగా సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ కుటుంబసభ్యులను కలిశారు. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+