పుణ్యానికి పోతే పాపం: అతన్ని మెడికో చంపేశాడు
చెన్నై: సలహా ఇవ్వడమే ఓ మాజీ సైనికుడి పాపమైంది. చదువుకోవాలని చెప్పినందుకు ఓ మెడికో చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు మెడికో సైకోలా మారిమాజీ సైనికుడిని కత్తితో పొడిచి చంపేశాడు.
తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కన్యాకుమారి జిల్లా శివనికుళంకు చెందిన కుమార్ అనే కాంట్రాక్టర్ కుమారుడు సంతోష్కుమార్ (25) చిదంబరంలోని ఒక ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు.

ఇటీవల తన సొంతూరికి వచ్చిన సంతోష్కుమార్ అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడం మానేశాడు. పరీక్షలు దగ్గరపడుతున్నప్పటికీ ఇంటివద్దనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని పదే పదే ఒత్తిడిచేశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి కుమార్ మాజీ సైనికుడైన కేరళలోని తన స్నేహితుడు నౌషాద్ వద్ద బాధపడ్డాడు.
తన కుమారుడికి నచ్చ చెప్పాల్సిందిగా వేడుకున్నాడు. దాంతో శివనికుళంలోని కుమార్ ఇంటికి వచ్చిన నౌషాద్ ఎట్టకేలకూ ఒప్పించాడు. శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటలకు చిదంబరం వెళ్లేందుకు సిద్ధమవుతూ నౌషాద్తో ఘర్షణ పడి విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో పొడిచాడు. దాంతో నౌషాద్ ప్రాణాలు విడిచాడు. సంతోష్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications