పీడీపీకి 6, బీజేపీకి 8... ఈ నెల 31న గవర్నర్ను కలవనున్న ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 31న ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు గెలుచుకుని జమ్మూ కాశ్మీర్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. పూర్తి మెజారిటీ రానప్పటికీ, 25 సీట్లు సాధించి రెండో స్ధానంలో నిలిచిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడికి ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. అలాగే ముఫ్తీ కేబినెట్లో పీడీపీకి ఆరు, బీజేపీకి ఎనిమిది మంత్రి పదవులు తొలి విడతగా లభించనున్నాయి.
ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ (44) స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగాయి. చివరకు పీడీపీ - బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications