'మి టూ'కు కౌంటర్గా 'మెన్ టూ'ను ప్రారంభించిన బెంగళూరువాసులు, ఫ్రాన్స్ మాజీ రాయబారి కూడా
బెంగళూరు: గత కొద్ది రోజులుగా తమను లైంగికంగా వేధించిన పురుషులపై పలువురు మహిళలు 'మి టూ' అంటూ ఫిర్యాదులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పురుషులపై వేధింపులను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు 'మెన్ టూ' అంటూ బెంగళూరుకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న క్రిస్ప్ అనే స్వచ్ఛంద సంస్థ దీనిని ప్రారంభించింది. ఈ సంస్థ నిర్వాహకుడు సామాజిక కార్యకర్త. అతని పేరు కుమార్ జాగిర్దార్. అతనితో పాటు మరో పదిహేను మంది కలిసి మెన్ టూను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన విషయాలను వారు ఆదివారం వెల్లడించారు.

తాము మీటూకు వ్యతిరేకం కాదని, కానీ తప్పుడు కేసులు, ఆరోపణల కారణంగా బాధపడుతున్న పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు దీనిని ప్రారంభించామని చెప్పారు.
వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండటం గమనార్హం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడని ఆయనపై భార్య కేసు పెట్టింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని 2017లో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.
క్రిస్ప్ నిర్వాహకుడైన జాగిర్దార్ వృత్తిరీత్యా అకౌంటెంట్, స్టాక్ మార్కెట్ నిపుణుడు. భార్యాబాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో ఆయనది కీలక పాత్ర. గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాల్లో సవరణలు చేయాలంటూ పదిహేనేళ్లుగా పోరాడుతున్నారు.
భార్య ఆయనను వదిలి వెళ్లిపోయింది. కూతురను కూడా తీసుకెళ్లింది. ఆమె ఓ క్రికెటర్ను వివాహం చేసుకుంది. తమ కూతురు సంరక్షణ భారం తనకు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అందులో విజయం సాధించారు. మహిళలకు, పురుషులకు ఎవరికి అన్యాయం జరిగినా పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications