Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్షల మంది పొట్ట కొట్టిన కొత్త చట్టం!

రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం వల్ల వేలాది మంది ఉద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయి. అనేక గేమింగ్ కంపెనీలు మూతపడటంతో వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులుగా మారారు. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. ఇది షేర్ మార్కెట్ లాగే చాలా మందికి ఆదాయ వనరుగా ఉండేది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిషేధం వల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఉద్యోగులలో భయాందోళన
భారత్‌లోని అతిపెద్ద రియల్-మనీ గేమింగ్ కంపెనీలలో పని చేసే ఉద్యోగులంతా ఆందోళనలో పడిపోయారు. ఎప్పటిలాగా ఆ కంపెనీలలో సాధారణ సందడి లేదు. ఎవరూ కూడా తమ ల్యాప్ టాప్‌లు కూడా తెరవడం లేదు. కొందరు సహోద్యోగులు కలిసి కూర్చుని.. భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. కొత్త అవకాశాలు వెతుక్కోండి అని చెప్పడం అనేది ఉద్యోగికి ఎదురయ్యే అత్యంత దారుణమైన అనుభవమని పలువురు గేమింగ్ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Millions Affected The Impact of India s Real Money Online Gaming Ban

ఉద్యోగం కోల్పోతామనే భయం, రాత్రికి రాత్రే అంతరించిపోయిన ఒక రంగంలో కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించాలి, ఇంటి, కారు లోన్లు చెల్లించాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలి. గేమింగ్, ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో పనిచేస్తున్న దాదాపు రెండు లక్షల మంది నిపుణులు ఇప్పుడు సందిగ్ధంలో మునిగిపోయారు.

ఆకస్మిక నిషేధం.. ఎందుకు?
ఆగస్టు 19న 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025'కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 20న లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. కొన్ని గంటల్లోనే అది ఆమోదం పొందింది. ఆ తర్వాత ఆగస్టు 21న రాజ్యసభలో, ఆగస్టు 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో అది చట్టంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్-మనీ గేమ్‌లపై నిషేధం అమలు కావడానికి కేవలం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ మాత్రమే మిగిలి ఉంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తోందని, భద్రతకు ముప్పుగా మారుతోందని ప్రభుత్వం పేర్కొంది. డ్రీమ్11, పేటీఎం ఫస్ట్ గేమ్స్, జంగ్లీ గేమ్స్, అడ్డా52 వంటి అనేక గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

సామాన్య ప్రజలపై ప్రభావం
ఈ మార్పు వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులే. తమ గుర్తింపును వెల్లడించడానికి ఇష్టపడని ఉద్యోగులు, "ఉద్యోగాలు మాత్రమే కాదు, సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన నైపుణ్యం కూడా పనికిరాకుండా పోయింది" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రీమ్11లో ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ, "ఈ రంగం ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోకుండా నిషేధం విధించడం తప్పు. ఇది లక్షలాది మంది ఉద్యోగులకు నష్టం కలిగిస్తుంది." అని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి చెందిన డ్రీమ్11 సీనియర్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, "స్థిరమైన జీవితం కోసం నాకు పదేళ్లు పట్టింది. ఇప్పుడే వివాహం చేసుకున్నాను. నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కెరీర్ ఇలా కూలిపోవడం మాటల్లో చెప్పలేనిది" అని అన్నారు. అడ్డా52లో పనిచేసే ఒక ఉద్యోగి మాట్లాడుతూ, "గర్భవతి అయిన ఒక సహోద్యోగి భార్య తన సోదరుడి ఫోన్ కాల్‌తో ఆందోళన చెందింది. మరికొన్ని నెలల్లో ఆమెకు డెలివరీ ఉంది. ఈ భయం వారి కుటుంబాలలోకి కూడా వ్యాపించింది." అని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థకు పెను నష్టం
ఈ నిషేధం వల్ల దాదాపు 2 లక్షల మంది ప్రత్యక్ష ఉద్యోగులు, 3 లక్షల మందికి పైగా పరోక్షంగా పనిచేస్తున్న వారు ప్రభావితమయ్యారు. అంతేకాకుండా, ఈ నిషేధం వల్ల ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.20,000 కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోనుంది. ఇంకా, ఆటగాళ్లు అక్రమ మార్గాలను, డార్క్ వెబ్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది, ఇది మోసం, వ్యసనం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు 45 కోట్ల మంది ప్రజలు నష్టపోయారని అనుకుంటే, మరోవైపు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని విస్మరించింది.

నిషేధం బదులు నియంత్రణ అవసరం
భారతదేశంలో మద్యపాన నిషేధం వంటివి ఎప్పుడూ పూర్తిగా విజయవంతం కాలేదు. నిషేధం వల్ల అక్రమ వ్యాపారాలు పెరిగి, నకిలీ మద్యం వల్ల అనేకమంది మరణించారు. ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీపీఎన్ (VPN) వంటి సాంకేతికత ద్వారా ప్రజలు అక్రమ సైట్‌లను ఉపయోగించడం కొనసాగిస్తారని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు ఆన్‌లైన్ గేమింగ్‌ను షేర్ మార్కెట్‌తో పోల్చారు. సెబీ నివేదిక ప్రకారం, 2022 నుండి మూడు సంవత్సరాలలో, 93 శాతం మంది రిటైల్ F&O వ్యాపారులు నష్టపోయారు, అయితే ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలిచే శాతం 15-20 శాతం ఉంది. ఈ నేపథ్యంలో, షేర్ మార్కెట్ చట్టబద్ధమైనప్పుడు, స్కిల్ బేస్డ్ గేమింగ్‌ను ఎందుకు నిషేధించాలని ప్రశ్నిస్తున్నారు.అన్ని వాటాదారులను కలుపుకుని, నియంత్రణ చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్చలు లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు అకస్మాత్తుగా ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టబడ్డాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+