మైనర్బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం: విందు ఇవ్వాలని డిమాండ్
భువనేశ్వర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత మరచి మానవమృగంలా చిన్నారిపై అకృత్యానికి ఒడిగట్డాడు. అంతేకాదు ఆ బాలిక గర్భం దాల్చిందని గ్రామానికి విందు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకొంది.
ఆ బాలికకు అండగా ఉండాల్సింది పోయి, ఆమె కుటుంబాన్ని వూరి నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా పాపపరిహారంగా గ్రామమంతటికీ విందు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని కోరాపుట్లో చోటుచేసుకుంది.
బల్దా ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు అతడిపై కేసు పెట్టారు.
మూడు వారాల క్రితం ఆ హెడ్మాస్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విషయం తెలిసేనాటికే ఆమె ఐదు నెలల గర్భిణి కావడంతో అబార్షన్కు వైద్యులు నిరాకరించారు.

ఇదిలా ఉండగా ఘటన గురించి తెలిసిన గ్రామస్థులు బాలిక కుటుంబం విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. వారు వెంటనే వూరు నుంచి వెళ్లిపోవాలంటూ సామాజిక బహిష్కరణ విధించారు.
అంతేగాక పెళ్లికి ముందే బాలిక గర్భం దాల్చడంతో పాపపరిహారంగా గ్రామస్థులకు విందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అధికారుల దాకా వెళ్లినప్పటికీ గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications