మైనర్బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం: విందు ఇవ్వాలని డిమాండ్
భువనేశ్వర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత మరచి మానవమృగంలా చిన్నారిపై అకృత్యానికి ఒడిగట్డాడు. అంతేకాదు ఆ బాలిక గర్భం దాల్చిందని గ్రామానికి విందు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకొంది.
ఆ బాలికకు అండగా ఉండాల్సింది పోయి, ఆమె కుటుంబాన్ని వూరి నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా పాపపరిహారంగా గ్రామమంతటికీ విందు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని కోరాపుట్లో చోటుచేసుకుంది.
బల్దా ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు అతడిపై కేసు పెట్టారు.
మూడు వారాల క్రితం ఆ హెడ్మాస్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విషయం తెలిసేనాటికే ఆమె ఐదు నెలల గర్భిణి కావడంతో అబార్షన్కు వైద్యులు నిరాకరించారు.
ఇదిలా ఉండగా ఘటన గురించి తెలిసిన గ్రామస్థులు బాలిక కుటుంబం విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. వారు వెంటనే వూరు నుంచి వెళ్లిపోవాలంటూ సామాజిక బహిష్కరణ విధించారు.
అంతేగాక పెళ్లికి ముందే బాలిక గర్భం దాల్చడంతో పాపపరిహారంగా గ్రామస్థులకు విందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అధికారుల దాకా వెళ్లినప్పటికీ గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.