Girl: అమ్మ మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ లు పంపించిన అమ్మాయి, ఫోన్ లాక్కొన్న తల్లి, ఆవేశంలో !
చెన్నై/ కన్యాకుమారి: సొంతఊరిలోని స్కూల్ లో చదువుకుంటున్న అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో చాలా సంతోషంగా ఉంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత ఆ అమ్మాయి తల్లి మొబైల్ ఫోన్ తీసుకుని సోషలో మీడియాలో కాలం గడుపుతోంది. ఇంటి పని చెయ్యకుండా ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తున్నావు, మొబైల్ ఫోన్ లో నువ్వు ఏం చేస్తున్నావు ? అంటూ తల్లి మందలించింది. అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ లాక్కొని పరిశీలించింది. నా మీద మా అమ్మకు డౌట్ వచ్చిందని అనుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.

10వ తరగతి అమ్మాయి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని అరల్వాయిమొళి సమీపంలోని వడకూరులో రమ్యా (15) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది. సొంతఊరు వడకూరులోని స్కూల్ లో 10వ తరగతి చదువుకుంటున్న రమ్యా ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్లివస్తోంది. రమ్యా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో చాలా సంతోషంగా కాలం గడుపుతోంది.

అమ్మాయికి మొబైల్ పిచ్చి
స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత రమ్యా ప్రతిరోజు ఆమె తల్లి మొబైల్ ఫోన్ తీసుకుని సోషలో మీడియాలో కాలం గడుపుతోంది. మొబైల్ ఫోన్ ఎక్కువ చూడకూడదు అని తల్లిదండ్రులు ఎంతచెప్పినా రమ్యా పట్టించుకోలేదని, ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో రమ్యా మేసేజ్ లు పోస్టు చేస్తోందని తెలిసింది.

ఉరి వేసుకుని ఆత్మహత్య
ఇంటిలో పని చెయ్యకుండా ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తున్నావు, మొబైల్ ఫోన్ లో నువ్వు ఏం చేస్తున్నావు ? అంటూ తల్లి రమ్యాను మందలించింది. రమ్యా దగ్గర మొబైల్ ఫోన్ లాక్కొని వంట గదిలోకి వెళ్లిన ఆమె తల్లి ఫోన్ పరిశీలించింది. నా మీద మా అమ్మకు అనుమానం వచ్చిందని ఆవేశంతో అదే రోజు సాయంత్రం రమ్యా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆవేశంలో ఎంతపని చేసింది
మొబైల్ ఫోన్ విషయంలో తల్లి మందలించిందని 10వ తరగతి అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇదే కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ సమీపంలోని కీజా పెరువిలైలో నివాసం ఉంటున్న విజయన్ అనే యువకుడు అతని సొంత బ్యాటరీ షాప్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications