మోదీ 3.0.. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతికి విజ్ఞప్తి.. అసలు సినిమా మొదలవుతుంది.. గెట్ రెడీ!!
నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ మేరకు సౌమ్య పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో మోడీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు ఆపై అన్ని పార్టీలు ఆమోదాన్ని తెలిపాయి. ఆపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి సెంట్రల్ హాల్లో ప్రసంగాన్ని చేశారు.
ఆపై ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా నరేంద్రమోడీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. నరేంద్ర మోడీతో పాటు 15మందికి పైగా ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్మును కలిశారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన నాయకులలో రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితీష్ కుమార్ లతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తదితరులు ఉన్నారు.

జూన్ 9వ తేదీన నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక మూడవ సారి పాలన పగ్గాలు చేపట్టనున్న క్రమంలో నరేంద్ర మోడీ సుపరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. దేశానికి ఎన్డీఏ పైన విశ్వాసం ఉందని పెరిగిన భారతీయుల అంచనాలకు తగ్గట్టుగా పాలన అందిస్తామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Leader of the National Democratic Alliance Shri @narendramodi met Hon’ble President Smt. Droupadi Murmu at Rashtrapati Bhavan and staked claim to form the NDA Government at the Centre. pic.twitter.com/bERXEp0MSY
— BJP (@BJP4India) June 7, 2024
గత పదేళ్ల పని ట్రైలర్ మాత్రమేనని, వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తామని అసలు సినిమా మొదలవుతుందని మోడీ తెలిపారు. భారతదేశ పరువు తీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మోడీ పేర్కొన్నారు. పదేళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ 100 మార్కును దాటలేదన్నారు.దేశానికి ఎన్డీయే పైనే విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసిన నేపథ్యంలో త్వరలో మోడీ ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి ప్రపంచ నేతలు హాజరు కానుండటం విశేషం.
-
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications