వాట్ యన్ ఐడియా సర్జీ: పొలాల్లో దిష్టిబొమ్మల్లా మోడీ, అమిత్ షా కటౌట్లు
కొన్ని నెలల క్రితం కర్నాటకలో ఎలెక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు వెళ్లింది. ఆ రాష్ట్రంలో ఎటుచూసినా జాతీయనాయకులు, రాష్ట్ర నాయకుల భారీ కటౌట్లు కనిపించేవి. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అంతగా నాయకులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు అక్కడి ప్రజలు. నాయకులు కూడా అంతే స్థాయిలో హామీలు గుప్పించారు. కటౌట్ల విషయానికొస్తే ఎక్కువగా కనిపించింది ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు యడ్యూరప్ప వే.
ఎన్నికలయ్యాయి మొత్తానికి బీజేపీ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్నాటకలో ఏర్పాటు అయ్యింది. హంగామా అంతా తగ్గినప్పటికి కూడా ఈ భారీ కటౌట్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సారి ప్రధాన రహదారుల్లోనో లేక ఇతరత్ర బహిరంగ ప్రదేశాల్లోనో కాదు... పచ్చని పంట పొలాల మధ్య ఈ కటౌట్లు ప్రత్యక్షమవుతున్నాయి. అవును మీరు చదివింది నిజమే... హుబ్లీలోని పొలాల్లోనే దిష్టిబొమ్మల్లాగా అక్కడ రైతులు ఈ భారీ కటౌట్స్ను ఏర్పాటు చేశారు.

ఈ సారి కురిసిన భారీ వర్షాలకు తరికేరి రైతులు నాట్లు కూడా నాటేశారు. మొలకలెత్తుతున్న సమయంలో ఎవరి కళ్లైనా తమ పంటలపై పడి దిష్టి తగులుతుందేమోనని ఊహించిన రైతులు... దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, యడ్యూరప్పల భారీ కటౌట్లను దిష్టి బొమ్మల్లాగా తమ పంటపొలాల్లో పెట్టారు. అయితే ఈ కటౌట్లకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.

ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ఈ భారీ కటౌట్లను రహదారులపై ఉంచారు.. ఇప్పుడు అవే కటౌట్లను పొంటపొలాల్లో ఉంచుతున్నారు అంతే తేడా అని చెబుతున్నారు రాజేష్ మాటపాటి అనే రైతు.
మొత్తానికి రైతులకు తట్టిన ఈ ఐడియాతో అటుగా వచ్చి పోయే వారి దృష్టి పంటపొలాలపైన కంటే కూడా దిష్టిబొమ్మలా పొలాల మధ్య నిటారుగా ఉన్న ఈ భారీ కటౌట్ల పైనే ఉంది. దీనిపైనే వారంతా చర్చించుకుంటున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications