వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రూపాయల చోరీకి కుమారుడికి నిప్పంటించిన కసాయి తల్లి

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్: కుటుంబ సభ్యులకు తెలియకుండా రూ. 5 చోరి చేసిన బాలుడు కాలినగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కన్నబిడ్డ మీద కనికరం లేకుండా కేవలం డబ్బు ముఖం చూసిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో రుక్సానా అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు షహిల్ (6) అనే కుమారుడు ఉన్నాడు. మంగళవారం షహిల్ తల్లికి తెలియకుండా పెట్టెలో ఉన్న చిల్లర తీసుకుని బేకరిలో బిస్కెట్లు తీసుకోవాలని అనుకున్నాడు.

Mother sets son ablaze for stealing Rs 5 in Rajasthan

ఆ ఆలోచనతో పెట్టెలో నుండి రూ. 5 చోరీ చేశాడు. అదే సమయంలో రుక్సానా విషయం గుర్తించింది. వెంటనే ఇంటిలో ఉన్న కిరోసిన్ తీసుకుని కుమారుడు షహిల్ మీద చల్లి నిప్పంటించింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు షహిల్ ను పీబీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాలుడు చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని నయషహర్ పోలీసులు అన్నారు. చోరీ చేసినందుకే తన కుమారుడికి నిప్పంటించానని రుక్సానా అంగీకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
The boy sustained burn injuries and is being treated at the PBM government hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X