నేనే పెద్ద సర్వేయర్ను: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్: తానే అతిపెద్ద సర్వేయర్ను అని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు. ఎన్నికల అనంతరం పలు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కొన్ని బీజేపీకి అనుకూలంగా, మరికొన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్లో వరుసగా నాలుగోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ఇది ఖాయమని శివరాజ్సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిగా తానే అతిపెద్ద సర్వేయర్ను అని చెప్పారు. పోలింగ్ పైన తాను బాగా అంచనా వేయగలనని తెలిపారు.

దతియాలోని ప్రఖ్యాత శ్రీ పీతాంబర పీఠ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.
230 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి తాము 200కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ఆశీస్సులు తమకు లభించాయని చెప్పారు. తన అంచనాల కంటే ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మెరుగు కాదని అభిప్రాయపడ్డారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications