Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజా రామ్మోహన్ రాయ్ ఒక బ్రిటీష్ ఏజెంట్: నోరు జారిన మంత్రి

మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. అనంతరం క్షమాపణ చెప్పిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అగర్ మాల్వాలో జరిగిన ఒక కార్యక్రమంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన రాజా రామ్మోహన్ రాయ్‌ను 'బ్రిటీష్ ఏజెంట్' అని మంత్రి పర్మార్ సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వివాదం ముదరకముందే మంత్రి వీడియో విడుదల చేసి క్షమాపణ కోరారు.

వీడియో ద్వారా క్షమాపణలు చెప్పిన మంత్రి
మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ శనివారం ఒక వీడియో విడుదల చేసి తన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. "నిన్న అగర్ మాల్వాలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో ఆయన జీవితం గురించి మాట్లాడుతూ కొన్ని సందర్భాల క్రమంలో నేను పొరపాటున రాజా రామ్మోహన్ రాయ్ గురించి తప్పుడు పదాలను ఉపయోగించాను. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. రాజా రామ్మోహన్ రాయ్ ఒక ప్రసిద్ధ సంఘ సంస్కర్త. నేను వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తాను. ఈ వ్యాఖ్య పొరపాటున నా నోటి నుంచి వచ్చింది, అందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను," అని పర్మార్ వీడియోలో పేర్కొన్నారు.

MP Minister Inder Singh Parmar Controversy Apologizes for Calling Raja Ram Mohan Roy a British Agent

మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్య
బిర్సా ముండా జయంతి సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ మాట్లాడుతూ... దేశంలో మిషనరీ స్కూల్స్ ద్వారా విద్య పేరుతో మత మార్పిడులు జరిగేవని చెప్పారు. ఆ సందర్భంలో ఆయన రాజా రామ్మోహన్ రాయ్‌ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. "దీని కోసం ఆంగ్లేయులు చాలా మందిని సంఘ సంస్కర్తలుగా సృష్టించారు. వారిలో రామ్మోహన్ రాయ్ కూడా ఉన్నారు. ఆయన బ్రిటీష్ ఏజెంట్‌గా పనిచేసేవారు." అని మంత్రి అన్నారు. ఆంగ్ల విద్య పేరుతో జరుగుతున్న మత మార్పిడి దుష్ప్రచారాన్ని ఆపడానికి బిర్సా ముండా ధైర్యం చేశారని, గిరిజనులను రక్షించడానికి బిర్సా ముండా కృషి చేశారని పర్మార్ అన్నారు.

ఎవరు రాజా రామ్మోహన్ రాయ్?
రాజా రామ్మోహన్ రాయ్ (1772లో పశ్చిమ బెంగాల్‌లోని రాధానగర్‌లో జన్మించారు) ఆధునిక భారతీయ సంఘ సంస్కర్తలలో అగ్రగణ్యుడు. ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆయన సతీసహగమనాన్ని రద్దు చేయాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, మత సంస్కరణలు, పత్రికా స్వాతంత్య్రం కోసం బలంగా పోరాడారు. ఆయన కృషి ఫలితంగానే 1829లో గవర్నర్ లార్డ్ విలియం బెంటింక్ ప్రభుత్వం సతీసహగమనాన్ని నిషేధించింది. ఆయనను భారతీయ పునరుజ్జీవన పితామహుడిగా పిలుస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి చారిత్రక ప్రముఖుడిపై మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే రాజకీయ దుమారం రేపడంతో, ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+