ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కాక్పిట్లోకి వెళ్లాడు, అరెస్ట్ చేసిన ఎయిర్పోర్ట్ పోలీస్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై - కోల్కతా ఇండిగో విమానంలోని ఓ ప్రయాణీకుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు కాక్పిట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కిందకు దించేశారు. రెండ్రోజుల క్రితం ఓ ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న విమానంలో టాయిలెట్ డోర్ అనుకొని విమానం తలుపు తీశాడు.
ఇప్పుడు ఈ ప్రయాణీకుడు చార్జింగ్ పెట్టుకోవాలంటూ కాక్పిట్లోకి ప్రవేశించాడు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలుస్తోంది. వెంటనే సిబ్బంది అతనిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

ఆ తర్వాత విచారించగా మద్యం మత్తులో అలా వ్యవహరించినట్లు చెప్పాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా నిబంధనల ప్రకారం ఇతరులు కాక్పిట్లోకి ప్రవేశించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారు.
సోమవారం ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న గోఎయిర్ విమానంలో ఓ బ్యాంక్ ఉద్యోగి టాయిలెట్ డోర్ అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారించారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పని చేయలేదని చెప్పాడు. అతని నుంచి సంతకాలు తీసుకొని విడిచిపెట్టారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications