ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కాక్పిట్లోకి వెళ్లాడు, అరెస్ట్ చేసిన ఎయిర్పోర్ట్ పోలీస్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై - కోల్కతా ఇండిగో విమానంలోని ఓ ప్రయాణీకుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు కాక్పిట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కిందకు దించేశారు. రెండ్రోజుల క్రితం ఓ ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న విమానంలో టాయిలెట్ డోర్ అనుకొని విమానం తలుపు తీశాడు.
ఇప్పుడు ఈ ప్రయాణీకుడు చార్జింగ్ పెట్టుకోవాలంటూ కాక్పిట్లోకి ప్రవేశించాడు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలుస్తోంది. వెంటనే సిబ్బంది అతనిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

ఆ తర్వాత విచారించగా మద్యం మత్తులో అలా వ్యవహరించినట్లు చెప్పాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా నిబంధనల ప్రకారం ఇతరులు కాక్పిట్లోకి ప్రవేశించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారు.
సోమవారం ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న గోఎయిర్ విమానంలో ఓ బ్యాంక్ ఉద్యోగి టాయిలెట్ డోర్ అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారించారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పని చేయలేదని చెప్పాడు. అతని నుంచి సంతకాలు తీసుకొని విడిచిపెట్టారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications