బాయ్ఫ్రెండ్తో లాడ్జీలో ఎంజాయ్, డోస్ ఎక్కువై ఇలా....
Recommended Video
ముంబై: బాయ్ఫ్రెండ్తో కలిసి సెక్స్లో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మరణించింది. లాడ్జీ గదిలో అనుమానాస్పదస్థితిలో మరణించిన వివాహిత కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన మహరాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకొంది.
మహరాష్ట్రలోని భీవండికి చెందిన ఓ వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భీవండిలోని ముంబ్రా ప్రాంతంలో ఆమె నివాసం ఉంటుంది. అయితే ఆమెకు ఓ బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఆమె అప్పుడప్పుడు అతడితో బయటకు వెళ్ళేదని స్థానికులు అంటున్నారు.
భర్తకు తెలియకుండానే ఆ వివాహిత చాటుమాటుగా ఈ తతంగాన్ని నడిపించేదని స్థానికులు చెబుతున్నారు. అయితే బాయ్ ఫ్రెండ్తో లైంగిక సుఖం కోసం ఇటీవల ఆమె బయటకు వెళ్ళింది. ఆ సమయంలోడ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.
బాయ్ఫ్రెండ్తో ఎంజాయ్ కోసం
ఇద్దరి పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత బాయ్ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేసేందుకు బయటకు వచ్చింది. భీవండి ప్రాంతంలోని ఓ లాడ్జీని తీసుకొన్నారు. ప్రియుడితో గడపేందుకు లాడ్జీని అద్దెకు తీసుకొన్నారు. అయితే లైంగిక ఆనందం కోసం దగ్గు మందు బాటిళ్ళను తాగింది. దీనికి తోడు మద్యం తీసుకొంది.వీటికి తోడు డ్రగ్స్ కూడ తీసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీటన్నింటి కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది.
పారిపోయిన ప్రియుడు
శరీరంలోకి మోతాదుకు మించి మత్తును నింపే మందులు ప్రవేశించడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఎంత లేపినా వివాహిత లేవలేదు. దీంతో భయపడిన బాయ్ఫ్రెండ్ లాడ్జీ గదిలోనే ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. స్పృహ కోల్పోయిన వివాహితను చూసి బాయ్ ప్రెండ్ పారిపోయాడు. హోటల్ సిబ్బందికి కనీసం సమాచారం కూడ ఇవ్వలేదు.
అసలు విషయం ఇలా
హోటల్ గది తలుపులు ఎంతకు తెరవలేదు. వెయిటర్ పిలిచి విసిగిపోయారు. ఈ తరుణంలో హోటల్ తలుపులను పగులగొట్టారు. అప్పటికే హోటల్రూమ్లో వివాహిత అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే హోటల్ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ప్రకటించారు.
భర్త ద్వారానే డ్రగ్స్ అలవాటు
వివాహితకు భర్త ద్వారానే డ్రగ్స్ అలవాటు అయ్యాయని ఆమె తండ్రి చెప్పారు. ఆమె మూడో భర్త ద్వారా డ్రగ్స్ అలవాటైన విషయాన్ని అతను పోలీసులకు వివరించారు. డ్రగ్స్ కోసం ఆమె ఇంత దూరం వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వివాహిత బాయ్ఫ్రెండ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.