నా తల్లి భరతమాత కోసం ఈ జన్మ ఎత్తా
NDA Parliamentary Party meeting: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తోన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ.. ఢిల్లీలో సమావేశమైంది. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన లోక్సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో ఏర్పాటైన సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నుకున్నారు.

అనంతరం మోదీ మాట్లాడారు. 10 సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పెను మార్పులు, సంక్షేమం, అభివృద్ధి, దేశం సాధించిన పురోగతిని చూసే ప్రజలు మూడోసారి తమకు పట్టం కట్టారని అన్నారు. ఈ దఫా ప్రభుత్వం మరింత కొత్తగా పరిపాలన సాగిస్తుందని హామీ ఇచ్చారు.
ఎన్డీఏ అనే పదాలకు మోదీ ఈ సందర్భంగా కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ అంటే- న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా.. అని చెప్పుకొచ్చారు. తదుపరి అయిదు సంవత్సరాల వ్యవధిలో దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని, ఆర్థికంగా ప్రపంచంలోనే శక్తిమంతంగా మలచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని అన్నారు.
తనకు ఈ జన్మ లభించింది.. భరతమాత కోసమేనని మోదీ ఉద్వేగంగా చెప్పారు. తన జీవితాన్ని వన్ లైఫ్ వన్ మిషన్గా అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులు కన్న కలలను సాకారం చేయడానికే ఈ జీవితంఉందని పేర్కొన్నారు. దీనికి 10 సంవత్సరాల కిందటే పునాది పడిందని అన్నారు.
ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాపైనా మోదీ నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పడంలో ఇండియా కూటమి నాయకులు పీహెచ్డీ పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. వీటికి దూరంగా ఉండాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్లతో దేశం నడవబోదని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ కేబినెట్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తోన్నాయని, వాటిల్లో చిక్కుకోవద్దని కోరారు.
తమ ప్రభుత్వ పరిపాలన తీరును చూసిన తరువాతే దక్షిణాది రాష్ట్రాలు కూడా బీజేపీ/ఎన్డీఏను ఆదరించాయని వ్యాఖ్యానించారు మోదీ. కర్ణాటక, తెలంగాణల్లో అంచనాలకు మించిన సీట్లను సాధించామని అన్నారు. కేరళలో కూడా ఖాతా తెరవగలిగామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్లల్లో ఇండియా కూటమికి ఎక్కడా చోటు లభించబోదని ధీమా వ్యక్తం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications