కాంగ్రెసు రెండో జాబితా: మీరట్ నుంచి నటి నగ్మా
న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కాంగ్రెసు రెండో జాబితాను విడుదల చేసింది. సినీ నటులు రాజ్ బబ్బర్, నగ్మా ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. ఈ జాబితాలో 35 శాతం మంది యువకులు, 11 మంది మహిళలు ఉన్నారు. సినీ నటి నగ్మా మీరట్ నుంచి పోటీ చేయనున్నారు.
సినీ నటుడు రాజ్ బబ్బర్ ఘజియాబాద్ నుంచి లోకసభకు పోటీ చేయనున్నారు. రీటా బహగుణకు లక్నో సీటు కేటాయించారు. నూర్ బానో మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఈసారి లోకసభకు పోటీ చేయనున్నారు.

యువజన కాంగ్రెసు అధ్యక్షుడు రాజీవ్ సతావ్ మహారాష్ట్రలోని హింగోలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. యువజన కాంగ్రెసు నుంచి సతావా కాకుండా మరో ఎనిమిదికి టికెట్లు లభించాయి. యువతకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
కాంగ్రెసు విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో క్రికెటర్ మొహమ్మద్ కైఫ్, నీలేకని ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు కూడా మొదటి జాబితాలో చోటు చేసుకున్నాయి. మొదటి జాబితా 194 మంది అభ్యర్థులతో ఇంతకు ముందు విడుదలైంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications