మరో రైలు ప్రమాదం: మహారాష్ట్రలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ప్రెస్
మంగళవారం తెల్లవారుజామున నాగ్పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.
నాగ్పూర్: రైల్వేలో వరుస ప్రమాద ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో రైలు పట్టాలు తప్పడంతో.. రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున నాగ్పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని తిత్వాల స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద ఘటనలో మొత్తం 7భోగీలు పట్టాలు తప్పగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు పట్టాల పైకి బురద, రాళ్లు వచ్చి చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.

డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందంటున్నారు. నిజానికి ఆ సమయంలో పొగమంచు కూడా భారీగా కమ్ముకోవడంతో తనకేమి కనిపించలేదని డ్రైవర్ తెలిపారు. ఈ ప్రమాదంతో ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
కాగా, అగస్టు 19న పూరి-హరిద్వార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు సైతం రాజీనామాకు సిద్దపడగా.. ప్రధాని మోడీ పునరాలోచించుకోవాల్సిందిగా ఆయనకు సూచించారు. తాజా ప్రమాద ఘటనతో సురేశ్ ప్రభు ఎలా స్పందిస్తారా? అన్నది చూడాలి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications