National Round up:నీట్ రద్దు నుంచి రాహుల్ పై మోదీ టార్గెట్ వరకు జాతీయ సమాహారం..!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరోవైపు ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఇలాంటి జాతీయ వార్తలను ఇప్పుడు చూద్దాం.
కేంద్ర మంత్రిపై ఈసీకి ఫిర్యాదు
కేంద్రమంత్రి శోభా కర్లాంజే పై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు దాడిలో తమిళనాడుకు చెందిన వ్యక్తి హస్తం ఉందని ఆరోపణలు చేశారు. దీనిపై డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శోభాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య అల్లర్లు సృష్టించేలా ఆమె వ్యాఖ్యలున్నాయంటూ డీఎంకే ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమిళ ప్రజలను శోభా కర్లాంజే అవమానించారని తన ఫిర్యాదులో పేర్కొంది డీఎంకే పార్టీ. ఇదిలా ఉంటే తమిళనాడు పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి శోభా. తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాల్సిందిగా కోరారు.

సీఏఏ అమలు లేదు, నీట్ పై నిషేధం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మార్చి 20వ తేదీ బుధవారం రోజున మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా బీజేపీ పై తీవ్ర విమర్శలు చేసింది. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను కమలం పార్టీ గాలికొదిలేసిందని డీఎంకే నిప్పులు చెరిగింది. మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం స్టాలిన్, ద్రవిడ పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు డీఎంకే ఏ హామీలైతే ఇచ్చిందో అన్నీ నెరవేరుస్తున్నామని గుర్తు చేసిన స్టాలిన్.. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్(NEET)పరీక్షను కూడా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. తమిళనాడులో CAAను అమలు చేయమని స్పష్టం చేశారు.
இரு மாநிலங்களுக்கு இடையே கலவரத்தை தூண்டும் வகையிலும், தமிழ்நாட்டு மக்களை இழிவுப்படுத்தியும் பேசிய ஒன்றிய அமைச்சர் ஷோபா மற்றும் பாஜக மீது நடவடிக்கை மேற்கொள்ளுமாறு இந்திய தேர்தல் ஆணையத்தில் கழக அமைப்புச் செயலாளர் திரு @RSBharathiDMK அவர்கள் புகார்! pic.twitter.com/XZObRlkxEA
— DMK (@arivalayam) March 20, 2024
రాహుల్ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 20 బుధవారం రోజున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో రాహుల్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పొలిటికల్ స్టార్టప్స్ ఒరిజినల్ స్టార్టప్స్ గురించి మాట్లాడుతూ... చాలామంది కొత్త పొలిటికల్ స్టార్టప్స్ ప్రారంభిస్తున్నారని అయితే ఒరిజినల్ స్టార్టప్స్తో కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయని అన్నారు.

అంతేకాదు రాజకీయాల్లో ఎన్ని స్టార్టప్లు ప్రారంభించినా మళ్లీ మళ్లీ వాటిని రీలాంచ్ చేయాల్సిందేనంటూ రాహుల్ను పరోక్షంగా టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. ఒరిజినల్ స్టార్టప్స్ కొన్ని ప్రయోగాలు చేస్తూ సరికొత్త రీతిలో ఆలోచన చేసి కొత్త ఐడియాలతో బయటకొస్తాయని చెప్పిన మోదీ... పొలిటికల్ స్టార్టప్స్ అలా ఉండవని చెప్పారు. అంతేకాదు భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతోందని చెప్పారు. భారత అభివృద్ధిలో స్టార్టప్స్ ప్రధాన భూమికను పోషిస్తాయని మోదీ నొక్కి చెప్పారు. యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పిన ప్రధాని మోదీ... నేటి యువత ఉద్యోగాలు పొందే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందని కొనియాడారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications