రవీష్ కుమార్కు రామన్ మెగసెసే అవార్డు
ఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికిగానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రామన్ మెగసెసే ఫౌండేషన్ ప్రకటించింది. జర్నలిజం రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు వెల్లడించింది.
రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తుండగా.. ఈ ఏడాది రవీష్ కుమార్తో పాటు మయన్మార్కు చెందిన కో స్వీ విన్, థాయ్లాండ్కు చెందిన అంగ్టానా నీల పైజిత్, ఫిలిప్పీన్స్కు చెందిన రేముండో పూజజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్నారు.
ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డును ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 9న ప్రదానం చేయనున్నారు.

ఈ ఏడాది భారత్ నుంచి పురస్కారానికి ఎంపికైన రవీష్ కుమార్కు పలువురు అభినందనలు తెలియజేశారు. రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవార్డుతో సత్కరిస్తోంది. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957లో ఏర్పాటు చేశారు. సామాజిక సేవ, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచశాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications