Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సరికొత్త ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌-పుక్కిలించి ఉమ్మేస్తే చాలు-మూడు గంటల్లో రిజల్ట్‌

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ పరిశోదనా సంస్దలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం వాడుతున్న కరోనా పరీక్షల విధానాలతో పాటు వ్యాక్సిన్లపైనా పరిశోధనలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్ధ నీరీ శాస్త్రవేత్తలు సెలైన్‌ ఆధారిత కొత్త రకం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరే ఇతర పరీక్షలతో పోల్చినా ఇది మెరుగైన ఫలితం ఇస్తుందంటున్నారు.

Recommended Video

    Saline-Gargle RT-PCR Test అత్యంత సులువైన COVID పరీక్ష | ICMR | NEERI || Oneindia Telugu
    నీరీ శాస్త్రవేత్తల ప్రయోగం

    నీరీ శాస్త్రవేత్తల ప్రయోగం

    జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్ధ నీరీ శాస్త్రవేత్తలు ప్రస్తుతం కరోనా రోగులకు వాడుతున్న పరీక్షల కంటే మెరుగైన సెలైన్‌ ఆధారిత కొత్త రకం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో మిగతా టెస్టుల కంటే రోగులు అత్యంత సులువుగా శాంపిల్స్ ఇచ్చేందుకు, టెస్టులు చేసి ఫలితం వెల్లడించేందుకు సైతం అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు. డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోసం వారు ఎదురుచూస్తున్నారు.

    సరికొత్త కరోనా పరీక్ష

    సరికొత్త కరోనా పరీక్ష

    కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం వాడుతున్న విధానాల్లో అత్యంత విశ్వసనీయమైనది ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌. ఇందులో భాగంగా రోగి ముక్కు, గొంతు నుంచి శాంపిల్స్‌ సేకరించి వాటిని పరీక్షిస్తారు. అందులో వైరస్‌ ఉన్నట్లు నిర్దారణ అయితే పాజిటివ్‌గా ప్రకటిస్తున్నారు. అయితే ఇలా శాంపిల్స్‌ను సేకరించి వాటిపై పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం ఆలస్యమవుతోంది. దీన్ని నివారించేందుకు వీలుగా నీరీ శాస్త్రవేత్తలు సరికొత్త కరోనా పరీక్షను అభివృద్ది చేశారు. ఈ పరీక్షలో అత్యంత సులువుగా రోగి నుంచి శాంపిల్‌ సేకరించవచ్చు.

    సెలైన్‌ ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌

    సెలైన్‌ ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌

    ఈ కొత్త రకం సెలైన్‌ ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌లో ఓ గొట్టంలో సెలైన్‌ ద్రావకాన్ని తీసుకుని దాన్ని రోగి నోటిలోకి తీసుకుని పుక్కిలించి ఉమ్మేస్తారు. దాన్ని యథాతథంగా ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ నిర్ణీత ఉష్ణోగ్రతలో నీరీ సంస్ధ తయారు చేసిన మరో బఫర్‌ సొల్యూషన్‌లో దాన్ని ఉంచి వేడి చేస్తారు. దీంతో ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌కు కావాల్సిన ఫలితం వచ్చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మూడు గంటల్లోనే పూర్తయి ఫలితం వచ్చేస్తుందని నీరీ శాస్తవేత్తలు చెప్తున్నారు..

    తాజా పరీక్షతో ప్రయోజనాలివే

    తాజా పరీక్షతో ప్రయోజనాలివే

    ప్రస్తుతం కరోనా రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరణకు వాడుతున్న స్వాబ్‌ టెస్టులతో పోలిస్తే ఇది అత్యంత సులువైన పరీక్ష అని నీరీ చెబుతోంది. అంతే కాదు స్వాబ్‌ టెస్టుల్లో అందరు రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరణ అంత సులువు కాదు. కానీ ఈ పరీక్షలో మాత్రం చాలా సులువుగా రోగి నోటి ద్వారా ద్రావకాన్ని తాగించి పుక్కిలించి ఉమ్మేయడమే కాబట్టి అత్యంత సులువుగా శాంపిల్‌ సేకరణ పూర్తవుతుందని శాస్తవేత్తలు చెప్తున్నారు. ఇందులో రోగులే తమ శాంపిల్‌ను సేకరించి ఇచ్చేందుకు కూడా వీలుందని పేర్కొంటున్నారు.
    ఇప్పటికే ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన ఈ విధానానికి డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించాల్సి ఉంది. మారుమూల ప్రాంతాల్లో ల్యాబ్‌ సౌకర్యాలు లేని చోట సైతం కరోనా రోగులకు ఈ టెస్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+