బడా వ్యాపారుల నుండి రుణాలను ఎందుకు వసూలు చేయరు: నితీష్
పాట్నా: బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దును బ్యాంకులు సక్రమంగా అమలు చేయలేకపోయాయన్నారు. డీమానిటైజేషన్ ప్రయోజనాలు ప్రజలు పొందేకపోయారని ఆయన చెప్పారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్లో ఇటీవల వేలాది కోట్ల కుంభకోణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
బ్యాంకుల నుండి వేలాది కోట్లు రుణాలు తీసుకొని విదేశాలకు తరలిపోతున్నారని ఆయన గుర్తు చేశారు. పెద్ద పెద్ద వ్యాపారులు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు తరలిపోతోంటే పేదోళ్ళు మాత్రం కఠినంగా బ్యాంకులను రుణాలను చెల్లించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

చిన్న చిన్న వ్యాపారులపై బ్యాంకులు కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బడా వ్యాపారుల నుండి బకాయిలు వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.
డీమానిటైజేషన్ కు తాను మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. డీమానిటైజేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం పొందకపోవడానికి బ్యాంకులే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు డిపాజిట్ చేసుకొంటే బడా వ్యాపారస్తులు రుణాల రూపంలో డబ్బులను తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని ఆయన చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications