బడా వ్యాపారుల నుండి రుణాలను ఎందుకు వసూలు చేయరు: నితీష్
పాట్నా: బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దును బ్యాంకులు సక్రమంగా అమలు చేయలేకపోయాయన్నారు. డీమానిటైజేషన్ ప్రయోజనాలు ప్రజలు పొందేకపోయారని ఆయన చెప్పారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్లో ఇటీవల వేలాది కోట్ల కుంభకోణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
బ్యాంకుల నుండి వేలాది కోట్లు రుణాలు తీసుకొని విదేశాలకు తరలిపోతున్నారని ఆయన గుర్తు చేశారు. పెద్ద పెద్ద వ్యాపారులు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు తరలిపోతోంటే పేదోళ్ళు మాత్రం కఠినంగా బ్యాంకులను రుణాలను చెల్లించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

చిన్న చిన్న వ్యాపారులపై బ్యాంకులు కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బడా వ్యాపారుల నుండి బకాయిలు వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.
డీమానిటైజేషన్ కు తాను మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. డీమానిటైజేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం పొందకపోవడానికి బ్యాంకులే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు డిపాజిట్ చేసుకొంటే బడా వ్యాపారస్తులు రుణాల రూపంలో డబ్బులను తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని ఆయన చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications