'రామమందిరానికి అడ్డు చెప్పిన వారే ఇప్పుడు భక్తులుగా మారారు'
అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరితరం కాదని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మంగళవారం అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లిం కమ్యూనిటీ సైతం అండగా నిలిచిందని తెలిపారు. ఆయన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నిమిత్తం లక్నో వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందు నుంచి మసీదు లేదని, ఆ ప్రదేశం రామ జన్మభూమి మాత్రమేనని ఆయన అన్నారు. విదేశీయుడైన బాబర్ పేరుతో అక్కడ ఏదో కడితే, దానినే బాబ్రీ మసీదుగాసంభోదిస్తున్నారన్నారు. ఆ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు బిజెపి నేతలు అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి లక్నో న్యాయస్థానానికి వచ్చిన విషయం తెలిసిందే.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications