రైల్వే ప్రయాణికులకు శుభవార్త! భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టిక్కెట్ల బుకింగ్..
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట కలగనుంది.

దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచే యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేయనున్నట్టు ఇండియన్ రైల్వే గురువారం ప్రకటించింది. ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు.
మొబైల్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని, దీనికోసం అవసరమైన క్యూఆర్ కోడ్ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. యూపీఐ చెల్లింపుల కోసం దేశవ్యాప్తంగా 14 వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల రైల్వే టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయని, కేవలం మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని జంషెడ్ వివరించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications