ఒడిశా రైలు ప్రమాదానికి పక్కనే ఉన్న మసీదు కారణం అని ట్వీట్, లేడీ లీడర్ కు !
బెంగళూరు: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించారు మరియు 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు, ఈ ప్రమాద దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
అయితే ఇలాంటి రైలు ప్రమాదంలోనూ కొందరు దుర్మార్గులు రాజకీయాలు చేస్తున్నారు. ఈ రైలు ప్రమాదానికి మసీదులే కారణమంటూ కొందరు ఫొటోలను షేర్ చేశారు. ఒడిశా రైలు ప్రమాదం విషాదానికి మత రంగు పులుముకునే పనులను కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఒడిశా పోలీసులు తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు హెచ్ఎస్. శకుంతల అనే మహిళ కూడా అలాంటి పోస్ట్ను షేర్ చేయడంతో ఒడిశా పోలీసులు ఆ మహిళ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే పోస్టులను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసులు హెచ్చరించారు. దీంతో బీజేపీ కార్యకర్త శకుంతల న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. అప్పటికే శకుంతల ఆమె చేసిన ట్వీట్ను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
అయితే శకుంతల చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా పోలీసులు కర్ణాటక పోలీసుల నుండి శకుంతల గురించి సమాచారాన్ని సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు కూడా ఈ ఫోటోను షేర్ చేశారని, అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేసి నమ్మవద్దని కోరారు.

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉందని కొందరు ఫోటోను షేర్ చేశారు. అయితే ప్రమాదానికి దూరంగా ఉన్న ప్రదేశం మసీదు కాదని ఇస్కాన్ దేవాలయమని తెలిసింది. గుడిలో సగం మాత్రమే ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి దానిని మసీదుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఒడిశా పోలీసులు తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై డేగ కన్ను వేశారు.
It has come to notice that some social media handles are mischievously giving communal colour to the tragic train accident at Balasore. This is highly unfortunate.
— Odisha Police (@odisha_police) June 4, 2023
Investigation by the GRP, Odisha into the cause and all other aspects of the accident is going on.
ఎలాంటి గందరగోళం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసు అధికారులు హెచ్చరించారు. అయితే చేసిన తప్పు గ్రహించిన శకుంతల పోలీసుల పట్టుకుంటారనే భయంతో ఇప్పటికే రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయి అరెస్టు కాకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications