500నోటుకు రేపే చివరి తేదీ: టోల్టాక్స్ ఎల్లుండి నుంచి అమలు
పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాతనోట్లు ఉన్నవారు ఇబ్బంది పడకుండా కొన్నిచోట్ల అవి చెలామణి అయ్యేలా కేంద్రం కొన్నిరోజులపాటు కొన్ని ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించింది. కాగా, ఆ వెసులుబాటు రేపటితో ముగియనుంది.
డిసెంబర్ 15 వరకు పెట్రోల్ బంకులు, విమాన ప్రయాణాలకు రూ.500 నోట్లు చెల్లుతాయని గతంలో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వెసులుబాటును కుదిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పెట్రోల్ బంకులు, విమానాల్లో డిసెంబర్ 2 తర్వాత పాత పెద్దనోట్లు స్వీకరించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది.

రేపు రాత్రి నుంచి టోల్ టాక్స్ అమలు
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ రుసుములు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. టోల్ రుసుములను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications