మహిళా దినోత్సవం నాడు: మహిళా రిజర్వేషన్లకై రాజ్యసభలో గొంతెత్తిన మహిళా ఎంపీలు
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి . నేటి నుండి ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాల తొలి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలకు పలు అంశాలపై మాట్లాడడానికి రాజ్యసభ చైర్మన్ అనుమతించారు. దీంతో లోక్సభ , రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఛాయా వర్మ , ప్రియాంక చతుర్వేది, ఫౌజియా ఖాన్ మరియు ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్య సభలో విపక్ష ఎంపీల డిమాండ్
కాంగ్రెస్ ఎంపి ఛాయ వర్మ మాట్లాడుతూ,శాసనసభలలో మరియు పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు పొందే సమయం ఆసన్నమైంది . తప్పక కల్పించాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వం బేటి పడావో 'గురించి మాట్లాడుతోంది, కాని కుమార్తెల పరిస్థితి ఏ మాత్రం బాలేదని అన్నారు . శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు యొక్క మొదటి చర్చ 24 సంవత్సరాల తరువాత జరుగుతుందని , ఈ బిల్లు రాజ్యసభ 2010లో ఆమోదించిన తరువాత రోజు నుండి ఇప్పటి వరకు వెలుగును చూడలేదని పేర్కొన్నారు . మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషి వల్ల మహిళలకు పంచాయతీలలో ప్రాతినిధ్యం లభించిందని కాంగ్రెస్ ఎంపి అమీ యాగ్నిక్ పేర్కొన్నారు . మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మహిళా ఎంపీలు పట్టు పట్టారు .
మహిళా సాధికారత కోసం బీజేపీ కృషి చేస్తోందన్న బీజేపీ ఎంపీలు
ఇక విపక్ష ఎంపీలకు కౌంటర్ గా మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషికి బిజెపి ఎంపిలు సీమా ద్వివేది, సంపతియా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మహిళలపై వివక్షను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి ఎంపి సరోజ్ పాండే అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం మరియు బేటీ పడావో, బేటీ బచావో'పై ప్రయత్నాలు ఈ దిశలో జరుగుతున్నాయని ఆమె తెలిపారు.విపక్ష ఎంపీల వ్యాఖ్యలకు బీజేపీ మహిళా ఎంపీలు బదులిచ్చారు.
పార్లమెంట్ లో పెండింగ్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు
మహిళల రిజర్వేషన్ బిల్లు - రాజ్యాంగం 108 వ సవరణ బిల్లు, 2008 మార్చి 9, 2010 న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పార్లమెంటులో పెండింగ్లో ఉంది. లోక్సభలోని అన్ని సీట్లలో మూడింట ఒక వంతు మరియు మహిళల కోసం అన్ని రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగాన్ని సవరించాలని బిల్లు ప్రతిపాదించింది. అయితే అది అప్పటి నుండి ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంది . దీంతో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలు గళమెత్తారు.
రాజ్యసభలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు
రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు జరుపుకునే రోజు మరియు వారి ఆలోచనలను , స్ఫూర్తిని, ధృడ నిశ్చయంతో ముందుకు సాగే వారి వైఖరిని గౌరవించే రోజని పేర్కొన్నారు . వారి విజయాలను అండర్లైన్ చెయ్యాల్సిన రోజు అంటూ పేర్కొన్నారు . మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు నేడు మహిళా ఎంపీలు పలు అంశాలపై మాట్లాడటానికి అనుమతినిచ్చారు .