ఆన్లైన్ సెక్స్ రాకెట్ రట్టు: హోటల్స్, గెస్ట్హౌస్లకు అమ్మాయిల్ని...
ముంబై: సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్బీ) పోలీసులు ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఓ ప్రయివేటు వెబ్ సైట్ ద్వారా కస్టమర్స్ను ఆకర్షిస్తున్నారు. ఇది తెలుసుకున్న ఎస్ఎస్బీ పోలీసులు కస్టమర్గా ఫోన్ చేశారు. అనంతరం ప్లాన్ వేసి వారిని పట్టుకున్నారు.
అరెస్టైన వ్యక్తిని అజయ్ అలియాస్ రోహిత్గా గుర్తించారు. సదరు వెబ్ సైట్ ఆన్ లైన్ వ్యభిచారం నిర్వహిస్తుందని తమకు సమాచారం అందిందని ఎస్ఎస్బీ అధికారులు చెప్పారు. ఆ వెబ్ సైట్లో ఇందుకు సంబంధించి ఓ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉందన్నారు.
తాము మొబైల్ ఫోన్ ద్వారా కాల్ చేశామని, పొవాయ్లోని తమ ఇంటికి ఓ యువతిని పంపించాలని అడిగామని చెప్పారు. శనివారం నాడు నిందితుడు ఓ యువతిని తీసుకొని వచ్చాడని, అప్పుడు తాము అతనిని పట్టుకున్నామని చెప్పారు.
మహిళను రెస్క్యూ హోంకు తరలిస్తామన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అనంతరం షెల్టర్ ఇస్తామన్నారు. నిందితుడు నగరంలోని పలు హోటల్స్, లాడ్జిలు, గెస్టు హౌస్లకు యువతులను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రతి డీల్కు కమీషన్ తీసుకుంటాడు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.