ఆక్సిజన్ కొరత, పీఎం మోడీ సమీక్ష : అక్రమ నిల్వలపై కొరడా ఝుళిపించాలంటూనే, కీలక ఆదేశాలు
కోవిడ్ -19 యొక్క ఘోరమైన సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సరఫరా , కొరతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. అనేక అంశాలపై వేగంగా పనిచేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడారు.

ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం, పంపిణీ వేగాన్ని పెంచడంపై సమీక్షలో మోడీ సూచనలు
ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం, పంపిణీ వేగాన్ని పెంచడం మరియు ఆరోగ్య సౌకర్యాలకు ఆక్సిజన్ సహాయాన్ని అందించడానికి వినూత్న మార్గాలను ఉపయోగించడం వంటి అనేక అంశాలపై మోడీ కేంద్ర మరియు రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు. ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన అనేక ప్రయత్నాలపై అధికారులు పిఎంకు వివరించారని సమాచారం
. ప్రైవేట్ మరియు పబ్లిక్ స్టీల్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆక్సిజన్ తయారీదారులతో పాటు పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిషేధించడం ద్వారా మెడికల్ ఆక్సిజన్ లభ్యత రోజుకు సుమారు 3,300 మెట్రిక్ టన్నుల మేర పెరిగిందని పీఎంకు అధికారులు వివరించారు.

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఆక్సిజన్ కు భారీ డిమాండ్ .. అధికారుల వివరణ
మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం, ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని అంగీకరించి, వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని దేశానికి హామీ ఇచ్చారు.
సమీక్ష లో పాల్గొన్న అధికారులు అధిక కోవిడ్ కేసుల కారణంగా రాష్ట్రాల నుండి ఆక్సిజన్ డిమాండ్ ఎలా క్రమంగా పెరుగుతోందో ప్రధానికి తెలియజేశారు. మంజూరు చేసిన 162 ఆక్సిజన్ ప్లాంట్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారులు పిఎంకు తెలియజేశారు.

అక్రమనిల్వలపై కొరడా ఝుళిపించాలన్న మోడీ , రైల్వే ద్వారా కూడా ఆక్సిజన్ సరఫరా
మరోపక్క ఈరోజు ఆక్సిజన్ సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ అక్రమ నిల్వలపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు . సుదీర్ఘ దూరం పంపే ట్యాంకర్ల కోసం రైల్వేను ఉపయోగిస్తున్నట్లు గా పేర్కొంది . ఇప్పటికే 20 రాష్ట్రాలకు డిమాండ్ నుంచి సరఫరా చేసినట్లుగా తెలిపింది. చాలా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సరఫరా పెంచటానికి కొత్త మార్గాలు వెతకాలన్న మోడీ , వివిధ రాష్ట్రాల ఆక్సిజన్ పరిస్థితిపై సమీక్ష
వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా, అడ్డంకి లేకుండా జరిగేలా చూడాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తి మరియు సరఫరాను పెంచడానికి వివిధ వినూత్న మార్గాలను అన్వేషించాలని మంత్రిత్వ శాఖలను పిఎం కోరారు. క్యాబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి మరియు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, ఔషధ, ఎన్ఐటిఐ ఆయోగ్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications