పాకిస్థాన్ కుట్ర..! భారత సైన్యం అలర్ట్
అహ్మదాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ గా రంగంలోకి దిగింది. మంగళవారం తెల్లవారుజామున బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన విరుచుకుపడింది. అయితే అది జరిగిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ భారత భూభాగంలోకి రావడం కలకలం రేపింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దాన్ని గుర్తించిన వాయుసేన సిబ్బంది కూల్చివేశారు.
భారత సైన్యం కదలికలను తెలుసుకునే క్రమంలో పాకిస్థాన్ డ్రోన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే అప్రమత్తంగా ఉన్న వాయుసేన సిబ్బంది.. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతో కూల్చివేశారు. భారత సైన్యం దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్ లో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. గుజరాత్ లోనూ ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అనుమానస్పద వస్తువులు గానీ వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications