పాకిస్థాన్ కుట్ర..! భారత సైన్యం అలర్ట్
అహ్మదాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ గా రంగంలోకి దిగింది. మంగళవారం తెల్లవారుజామున బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన విరుచుకుపడింది. అయితే అది జరిగిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ భారత భూభాగంలోకి రావడం కలకలం రేపింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దాన్ని గుర్తించిన వాయుసేన సిబ్బంది కూల్చివేశారు.
భారత సైన్యం కదలికలను తెలుసుకునే క్రమంలో పాకిస్థాన్ డ్రోన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే అప్రమత్తంగా ఉన్న వాయుసేన సిబ్బంది.. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతో కూల్చివేశారు. భారత సైన్యం దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్ లో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. గుజరాత్ లోనూ ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అనుమానస్పద వస్తువులు గానీ వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications