326 రోజులు అలుపెరగని వేట.. ఎట్టకేలకు ఆ ఏడుగురు పాక్ ఉగ్రవాదులు హతం..
జమ్ము, కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో భారత బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు ఏడాదిపాటు సాగిన సంయుక్త ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సోమవారం ప్రకటించారు. వైట్ నైట్ కార్ప్స్, జమ్ము కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ కలిసి ఈ ఆపరేషన్ను చేపట్టాయి.
ఆపరేషన్ కిష్త్వార్లోని ఛత్రూ ప్రాంతంలో ఎత్తైన శిఖరాల్లో జరిగింది. దట్టమైన అడవులు, కఠినమైన పర్వత భూభాగంలో ఉగ్రవాదులను బలగాలు నెలల తరబడి ట్రాక్ చేశాయి. వైట్ నైట్ కార్ప్స్ ఈ కృషిని ఇలా వివరించింది: "కిష్త్వార్ ప్రాంతంలో 326 రోజుల పాటు నిర్విరామంగా, శ్రమతో కూడిన ఎత్తు ప్రాంత సంయుక్త ఆపరేషన్లు నిర్వహించాయి." "చలి, తడి, గడ్డకట్టే వాతావరణంలో, సవాలుతో కూడిన భూభాగంలో బలగాలు ఉగ్రవాదులను వెంబడించాయి, ఇది పలు ఎన్కౌంటర్లకు దారితీసింది." అని కార్ప్స్ తెలిపింది.
జమ్ము కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ సహకారంతో బలగాలు పనిచేశాయని కార్ప్స్ తెలిపింది. "సివిల్, మిలిటరీ నిఘా ఏజెన్సీలు ఏర్పాటు చేసిన పటిష్టమైన నిఘా గ్రిడ్ను" ఉపయోగించి, "చివరికి ఛత్రూ, కిష్త్వార్లోని ఏడుగురు భయంకరమైన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టారు."ఆపరేషన్లలో ఆధునిక సాంకేతికతలు కీలకంగా మారాయి. సైన్యం వెల్లడిస్తూ, "FPV డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, RPAలు/UAVలు, కమ్యూనికేషన్ వంటి సాంకేతికతను ఆపరేషన్లకు సహాయపడటానికి నిరంతరం ఉపయోగించుకున్నారు." అని పేర్కొంది.
ఆదివారం నాడు అటవీ ప్రాంతంలోని కొండల పాదాల వద్ద జరిగిన ఒక ఎన్కౌంటర్లో, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మహ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బలగాలు దగ్గర పడటంతో, ఉగ్రవాదులు మట్టి ఇంట్లో నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల సందర్భంగా ఇల్లు అగ్నికి ఆహుతి కావడంతో, లభ్యమైన మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. చనిపోయిన వారిలో ఐదేళ్ల క్రితం చొరబడిన సీనియర్ కమాండర్ సైఫుల్లా ఒకడని ప్రాథమిక అంచనా. అనేక ప్రాణాంతక దాడులతో ఇతనికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.

వైట్ నైట్ కార్ప్స్ ఈ విజయంపై స్పందిస్తూ, "సైఫుల్లా, అతని సహచరులను మట్టుబెట్టడంలో మన బలగాల నిర్విరామ పట్టుదల, సంకల్పం... మన యూనిఫాంలోని పురుషులు, నిఘా ఏజెన్సీల సంకల్పం, ధైర్యం, పరాక్రమం ముందు ఏదీ నిలబడదని రుజువు చేస్తుంది." అని ప్రకటించింది. ఆపరేషన్ త్రాషి-I గురించి కౌంటర్-ఇన్సర్జెన్సీ ఫోర్స్ డెల్టా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఏ. పి. ఎస్ బాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు స్థానిక మద్దతు లభించిందని పరోక్షంగా సూచించారు. ఆయన మాటల్లో: "వారికి మద్దతు వ్యవస్థ ఉంది, మద్దతు వ్యవస్థ లేకుండా ఇది సాధ్యం కాదు. దీనిపై పోలీసులకు పూర్తి అవగాహన ఉంది."
మేజర్ జనరల్ బాల ఇంకా, "పేర్లు చెప్పకుండానే వారికి (పోలీసులకు) సమాచారం ఉంది, వారందరిపై అవసరమైన చర్యలు తీసుకుంటారు..." అని తెలిపారు. ఈ మిషన్ను సమన్వయానికి ఒక నమూనాగా పేర్కొంటూ, "త్రాషి ఇటీవల ముగిసిన ఆపరేషన్ పట్టుదలకు... అన్ని స్థాయిలలో సమన్వయానికి సరైన ఉదాహరణ." అని ప్రశంసించారు. బలగాలు "చాలా ప్రశాంతంగా, సంయమనంతో, సమష్టిగా, సహకార పద్ధతిలో" పనిచేశాయని బాల వివరించారు. "ముఖ్యంగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా విజయం సాధించారని అన్నారు.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications