పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లిన తమిళనాడు మంత్రులు: ఇక శశికళ, దినకరన్ పని ఫినిష్ !
అన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది. టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టాలంటే కచ్చితంగా ఇరు వర్గాలు విలీనం కావాలని నిర్ణయించారని తెలిసింది.
శశికళకు చెక్: దినకరన్ ఎత్తులకు సీఎం పళనిసామి పైఎత్తులు, విలీనంపై నేడు నిర్ణయం !
మంగళవారం తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి విలీనం విషయంలో ఆయనతో చర్చలు మొదలు పెట్టారు. ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎంపీ వైద్యలింగం సైతం పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని సమాచారం.
శశికళ ఫ్యామిలీని అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యాలంటే మొదటి నుంచి ఆ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న మీరు విలీనం చర్చలకు సిద్దం కావాలని మంత్రులు వేలుమణి, తంగమణి పన్నీర్ సెల్వంకు నచ్చచెబుతున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం రెండు వర్గాలు కలిసిపోవాలని సూచించారని తెలిసింది.
శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప ఇంటర్వూలు ఆపండి: కర్ఱాటక సీఎంకు లేఖ, ఇదో కొత్త వార్నింగ్ !
పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు సైతం విలీనం అయితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మరో వైపు టీటీవీ దినకరన్ సైతం తన వర్గంలోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. ఎలాగైనా ఆగస్టు 5వ తేదీ పార్టీ పగ్గాలు చేపట్టాలని దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టడానికి పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం ఒక్కటి కావడానికి తొలిఅడుగు పడింది.