తమిళనాడు సీఎంకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పన్నీర్ సెల్వ వర్గం, అదే జరిగితే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఆ రాష్ట్ర మాజీ మంత్రి పాండియరాజన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో మీరు చేరాలని ఎడప్పాడి పళనిసామిని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేపాండియరాజన్ ఆహ్వానించారు.
ఐటీ అధికారిణికి వార్నింగ్: తమిళనాడు మంత్రులపై కేసు: కొంప మునిగింది !
తమిళనాడు విద్యాశాఖ మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యే పాండియరాజన్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను వ్యతిరేకించే వారికి మా వర్గంలో ఎప్పుడూ స్థానం ఉంటుందని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శశికళ కుటుంబ సభ్యుల తీరుతో విసుగుచెందారని మాకు సమాచారం వచ్చిందని, ఆయనకు అభ్యంతరం లేకపోతే పన్నీర్ సెల్వం వర్గంలో చేరి చిన్నమ్మ కుటుంబ సభ్యుల మీద పోరాటం చేస్తే మేము మద్దతు ఇస్తామని అన్నారు.
షాక్: తమిళనాడు సీఎంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు: ముగ్గురు వస్తే ఢమాల్ !
శశికళ వర్గంలో చివరి రోజు వరకు రిసార్టులో ఉన్న పాండియరాజన్ ఆఖరి క్షణంలో పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు. ఎమ్మెల్యే పాండియరాజన్ వ్యాఖ్యలతో శశికళ వర్గంలోని నాయకులు హడలిపోయారు. సీఎంనే పన్నీర్ సెల్వం వర్గంలో చేరాలని ఆహ్వానిస్తూ పాండియరాజన్ సంచల వ్యాఖ్యలు చేశారు.