అన్యాయం జరిగింది: పన్నీరు సెల్వం కోసం ప్రాణత్యాగం
మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలపాలైన అతడిని కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మూసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల తమిళ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనని తీవ్రంగా కలచి వేశాయని, పన్నీర్కు అన్యాయం జరిగిందని మూస ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పన్నీరు సెల్వం, మాజీ మంత్రులు పాండ్యరాజన్, పొన్నయన్, కేపీ మునుస్వామిలు బాధితుడిని పరామర్శించి ఖర్చుల నిమిత్తం రూ.1లక్షను కుటుంబ సభ్యులకు అందించారు.
పెరియ కాంచీపురం ప్రాంతానికి చెందిన మూసా పెయింటర్గా పని చేసేవాడు. మూసాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శశికళకు వ్యతిరేకంగా, పన్నీరుకు మద్దతుగా నినాదాలు చేస్తూ వానిగర్ వీధిలోకి వచ్చిన మూసా.. తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications