కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..! కీలక సవరణలివే..!
దేశంలో పన్ను గణనను సరళీకృతం చేసే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లును కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో ఆమోదించింది. ఇప్పటికే తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును తాజాగా ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. నిన్న లోక్ సభలో, ఇవాళ రాజ్యసభలో కొత్త బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు వ్యక్తులు, కార్పోరేషన్లు రెండింటికీ దీర్ఘకాలిక ఆదాయపు పన్ను చట్టాన్ని వర్తింపచేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో రెండు ద్రవ్య బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఆదాయపు పన్ను బిల్లు
2025, అలాగే పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025 ఉన్నాయి. దీంతో ఈ రెండు బిల్లుల్ని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లుల్ని తిరిగి లోక్ సభకు పంపారు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు కొత్త ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లుల్ని ఆమోదించినట్లయింది.

1961 నాటి ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని భాగాలు కాలం చెల్లిపోయాయని, అందుకే ఈ కొత్త చట్టం అవసరమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు. వాస్తవానికి లోక్ సభలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ బిల్లుకు పలు మార్పులు సూచించింది. దీంతో తాజాగా ఈ బిల్లును లోక్ సభలో ఉపసంహరించి తిరిగి ప్రవేశపెట్టి మార్పులతో మోదించారు.
సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఆస్తి వార్షిక విలువ గణనపై క్లారిటీ, ఇంటి ఆస్తి ఆదాయం నుండి తగ్గింపులు, పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు కాని వారికి కమ్యూటెడ్ పెన్షన్ తగ్గింపులను అనుమతించడం, తాత్కాలికంగా ఉపయోగించని వ్యాపార ఆస్తులను "గృహ ఆస్తి" ఆదాయంగా పన్ను విధించకుండా ఉండటానికి సవరణ వంటివి ఉన్నాయి. ఈ మార్పులు చట్టాన్ని ప్రస్తుత నిబంధనలతో సమలేఖనం చేస్తూ న్యాయంగా,స్పష్టతను మెరుగుపరుస్తాయని కమిటీ తెలిపింది.అయితే ఇందులో పన్ను స్లాబ్లు, మూలధన లాభాల నియమాలు లేదా ఆదాయ వర్గాలలో మార్పులు లేవు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications