Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మందుబాబులకు బిగ్ షాక్: బాటిల్‌పై రూ.40 వరకు పెంపు: పెట్రోల్, డీజిల్ పైనా భారం: కొత్త సెస్

ప్రభుత్వం సామాజిక భద్రత సెస్ ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలను చేసింది. ఈ సెస్ కింద పెట్రోల్, డీజిల్ పై రూ.2, మద్యంపై రూ.20 మేర పెంచినట్లు ప్రకటించింది.

తిరువనంతపురం: సరిగ్గా రెండు రోజుల కిందటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. చాలాకాలం నుంచి వినిపిస్తోన్న పలు డిమాండ్లను ఆమె పరిశీలనలోకి తీసుకోలేదు. అందులో ప్రధానమైనవి- మద్యం, పెట్రోల్, డీజిల్. వాటిని వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకుని రావాలనే డిమాండ్ ఉన్నప్పటికీ- అనుకూలంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక- ఈ డిమాండ్‌ పై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కేరళ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రెండింటి రేట్లను భారీగా పెంచింది. ఈ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలను చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కొద్దిసేపటి కిందటే ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించిన అంశాల గురించి సమగ్రంగా సభకు వివరించారు. పెట్రోల్, డీజిల్, మద్యం రేట్లను ఎందుకు పెంచాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత ఇచ్చారు.

Petrol, diesel and liquor are to cost more in Kerala as the govt imposed Social Security Cess on sales

పెట్రోల్, డీజిల్ అమ్మకాలను లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచాలని ప్రతిపాదించినట్లు బాలగోపాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం కనీసం 2,000 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించేలా ప్రత్యేక చర్యలను తీసుకోవడానికి ఈ మొత్తాన్ని బదలాయించాలని ప్రతిపాదించామని అన్నారు.

మద్యం రేట్లను కూడా భారీగా పెంచినట్లు ప్రకటించారాయన. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాలపై వీటిని వర్తింపజేశారు. 500 నుంచి 999 రూపాయల మధ్యలో ఎంఆర్‌పీ ధర ఉన్న ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలపై బాటిల్ ఒక్కింటికి 20 రూపాయలు, ఎంఆర్‌పీ 1,000 రూపాయలను దాటిన మద్యం అమ్మకాలపై బాటిల్ ఒక్కంటికి 40 రూపాయల మేర పెంచినట్లు ఆర్థికమంత్రి బాలగోపాల్ తెలిపారు. దీనివల్ల ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల మొత్తం అదనంగా ఖజానాకు వస్తుందని అంచనా వేసినట్లు వివరించారు.

Petrol, diesel and liquor are to cost more in Kerala as the govt imposed Social Security Cess on sales

అదనంగా వచ్చిన మొత్తాన్ని సామాజిక భద్రత సెస్ కు మళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ మోటార్ క్యాబ్‌లు, ఎలక్ట్రిక్ టూరిస్ట్ మోటార్ క్యాబ్‌లపై వన్-టైమ్ ట్యాక్స్ కొనుగోలు విలువను అయిదు శాతానికి తగ్గించినట్లు బాలగోపాల్ చెప్పారు. కేంద్రం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు, రుణ పరిమితిపై కోత విధింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+