భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు ఒక రూపాయి 34 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటర్కు 2 రూపాయల 37 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ ధరల పెంపు ఆయా రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రాలు విధించే లేవీలు వేర్వేరుగా ఉండడంతో ఆ ధరలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. గత రెండు నెలల కాలంలో పెట్రో ధరలు పెరగడం ఇది నాలుగో సారి.

చివరిసారి సెప్టెంబర్ 30వ తేదీన పెట్రోలు, డీజిల్ ధరలు మారాయి. అప్పుడు ఆయిల్ కంపెనీలు పెట్రోలు ధరను లీటర్కు 36 పైసలు పెంచగా, డీజిల్ ధరను లీటర్కు 7 పైసలు తగ్గించాయి. పెట్రోల్ ధర ప్రస్తుతం ఢిల్లీలో లీటర్కు రూ.64.57 ఉంది. డీజిల్ ధర లీటర్కు రూ.52.52 ఉంది.
ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రిన పెరిగిన ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడు పెట్రోల్ పైన లీటర్కు రూ.3.38 పైసలు, డీజిల్పై లీటర్కు రూ.2.67 పైసలు పెరిగింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications