షారుక్ తర్వాత మోడీ: బాలీవుడ్ తారలు కాకుండా ప్రధానే
న్యూఢిల్లీ: సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలోయర్ల సంఖ్య ఏడాది సమయంలో నాలుగు రెట్లు పెరిగింది. టాప్ 10 జాబితాలో ప్రధాని మోడీ మినహా అందరూ బాలీవుడ్ తారలే ఉన్నారు. బాలీవుడేతరుల్లో ప్రధాని మోడీ ఒక్కరే ఉన్నారు.
నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు ట్విట్టర్లో ఆయనను నలభై లక్షల మందికి పైగా అనుసరించేవారు. ఏడాది కాలంలో ఆ సంఖ్య 1.64 కోట్లకు చేరింది. 2015కు గాను భారత్లో అత్యధికులు అనుసరించే ఖాతాలను ట్విట్టర్ విడుదల చేసింది.
ఈ జాబితాలో 1.81 కోట్ల మంది అనుచరులతో బాలీవుడ్ నటుడుఅమితాబ్ బచ్చన్ ముందున్నారు. రెండో స్థానంలో 1.65 కోట్ల మందితో కింగ్ ఖాన్ షారుక్ఖాన్ ఉన్నారు. జాబితాలోని మొదటి పదిమందిలో బాలీవుడ్కు చెందని వ్యక్తి ప్రధాని మోడీయే.
ఆయన ప్రారంభించిన కుమార్తెతో సెల్ఫీ అనే కార్యక్రమానికి 3,75,000 హాష్ట్యాగ్లు వచ్చాయి. వీరి బాలీవుడ్ నటులు తర్వాత నాలుగో స్థానంలో అమీర్ ఖాన్, ఐదో స్థానంలో సల్మాన్ ఖాన్, ఆరో స్థానంలో దీపికా పదుకొణె, ఏడో స్థానంలో హృతిక్ రోషన్, ఎనిమిదో స్థానంలో ప్రియాంకా చోప్రా, తొమ్మిదో స్థానంలో అక్షయ్కుమార్, పదో స్థానంలో ఏఆర్ రెహ్మన్ ఉన్నారు.