Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ వర్షాలతో అతలాకుతలం: ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో వర్షపాతానికి సంబంధించిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాన మంత్రి మోడీ సీఎంలకు హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రెండూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాలలో తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం పలువురు మరణించారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెస్క్యూ, ఇతర సహాయ చర్యలపై SDMAతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర శాఖల అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. యాత్రికులు వాతావరణ పరిస్థితులను సరిగ్గా పరిశీలించిన తర్వాతే తమ యాత్రను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

PM Modi Speaks With CMs Of Himachal, Uttarakhand Over Massive Rainfall, Flood

అత్యవసర పరిస్థితులను సకాలంలో నిర్వహించగలిగేలా తమ మొబైల్, ఇతర కమ్యూనికేషన్ ఛానెల్‌లను తెరిచి ఉంచాలని అధికారులను కూడా ఆదేశించినట్లు ధామి తెలిపారు. "రాష్ట్రంలో భారీ వర్షపాతం ఉన్నందున విపత్తు నిర్వహణ అథారిటీ, రాష్ట్ర అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. యాత్రికులందరూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను కొనసాగించాలి" అని సీఎం సూచించారు.

హిమాచల్ ప్రదేశ్ వరదలు:

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం ఎంతమేరకు జరిగిందనే దానిపై హిమాచల్ సీఎం సుఖుతో జరిపిన కాల్‌లో పీఎం నరేంద్ర మోడీ ఆరా తీశారని తాజాగా, విడుదల చేసిన అధికారిక ప్రకటన తెలిపింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం.. మోడీకి తెలియజేశారు. నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానిని కోరినట్లు సుఖు తెలిపారు.

PM Modi Speaks With CMs Of Himachal, Uttarakhand Over Massive Rainfall, Flood

హిమాచల్ ప్రదేశ్ విపత్తు కారణంగా సంభవించిన విస్తృతమైన నష్టాల నుంచి కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన సహాయం అవసరమని సుఖు చెప్పారు. రాష్ట్ర పునరుద్ధరణ ప్రక్రియలో సహాయం చేయడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని విస్తరించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ.. పీఎం మోడీ ఆయనకు కేంద్రం తిరుగులేని మద్దతు గురించి హామీ ఇచ్చారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి రాష్ట్రానికి అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్ వరద పరిస్థితులు:సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారి, అనేక ఇతర రహదారులు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత హైవేపై ట్రాఫిక్ పునరుద్ధరించబడిందని, ఇంకా మూసివేయబడిన ఇతర రహదారులను తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప కొండలపైకి వెళ్లవద్దని రాష్ట్ర పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. కోటిలో గరిష్టంగా 155 మిమీ, భగవాన్‌పూర్‌లో 88 మిమీ, చక్రతలో 74.3 మిమీ, వికాస్‌నగర్‌లో 66.5 మిమీ, ముస్సోరిలో 60.2 మిమీ, పురోలా 60 మిమీ, హరిద్వార్‌లో 57 మిమీ, కల్సిలో 55.5 మిమీ, మోరిలో 55.5 మిమీ, మోరిలో గరిష్టంగా 155 మిమీ వర్షం పడింది. గత 24 గంటల్లో బార్కోట్‌లో 51 మిమీ, ధనౌల్టీలో 45 మిమీ, లక్సర్‌లో 40 మిమీలు వర్షపాతం నమోదైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+