ఉచిత పథకాలపై ప్రధాని మోడీ హెచ్చరికలు- ఓట్ల కోసం దిగజారొద్దని పార్టీలకు హితవు..

దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ జనాన్ని ఆకట్టుకునేందుకు ఉచిత పథకాల జపం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలైతే కేవలం ఉచితాలపైనే ఆధారపడి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాల్ని నడిపిస్తున్నాయి. వీటి కోసం భారీగా అప్పులు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై ప్రధాని మోడీ ఇవాళ హెచ్చరికలు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఉచిత పథకాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపై పార్టీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రెవెడి సంస్కృతికి (స్వీట్లు ఉచితంగా పంచడం) వ్యతిరేకంగా ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇది దేశ అభివృద్ధికి 'చాలా ప్రమాదకరమైనది' అని అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రెవిడి ఒక ప్రసిద్ధ స్వీట్. 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని పాలసీలు తీసుకువస్తే దేశాభివృద్ధికి, వృద్ధికి ఊతమిచ్చే ఆలోచన కూడా ఉందన్నారు.

PM Modi warning against electoral freebies- launched Bundelkhand expressway

ప్రధాని మోదీ 'రెవ్డీ కల్చర్' వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. 'రేవ్డీ పదం అన్‌పార్లమెంటరీ కాదా?' అని ఆయన్ను ప్రశ్నించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో దీనిపై స్పందిస్తూ.. "యువతకు ఉద్యోగాలు ఇస్తూ రేవిడి పంపిణీ చేస్తూ అధికార పార్టీలో ఉన్నవారు ధన్యవాదాలు ప్రచారం చేస్తే, వారు ఈ నిందించే సంస్కృతి నుండి తమను తాము రక్షించుకోవచ్చన్నారు. తద్వారా అవే ఉచితాలతో అధికారంలోకి వచ్చి మీరు ఇప్పుడు ఇతరులపై నిందలు వేస్తారా అని అఖిలేష్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+