పంజాబ్, గోవాల్లో పోలింగ్: క్యూలో నిలబడి ఓటేసిన పారికర్
పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారంనాడు ప్రారంభమైంది. గోవాలో తమ పార్టీ గెలిచి తీరుతుందని పారికర్ అన్నారు.
న్యూఢిల్లీ : పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పంజాబ్లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరడం కనిపించింది.
కాగా, ఉదయం 9.30గంటల వరకే గోవాలో 15శాతం ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పానాజీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవాలో భారీగా ఓటింగు నమోదమవుతున్నట్లు చెప్పారు. తాము గెలుస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోస్టల బ్యాలెట్లకు బదులు ఈ -బ్యాలెట్ వాడుతున్నారు. సైనికులతో సహా వివిధ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు దీని ద్వారా ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. గోవాలో 40 స్థానాలకు 251 మంది అభ్యర్థులు పంజాబ్లో 117 స్థానాలకు 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్లో 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మార్చి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications