గర్భవతి అయిన టెక్కీ చెన్నైలో ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తంబారంలోని తన నివాసంలో మహిళా టెక్కీ బుధవారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె గర్భవతి.
ఆమెను శేంబాగం శరవనకుమార్గా గుర్తించారు. ఓ చెన్నైలోని ఓ ఐటి కంపెనీలో ఆమె పనిచేస్తోంది. ఆమె భర్త శరవనకుమార్ బెంగళూరులోని ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
తనకు సుస్తీగా ఉందనే కారణంతో శాంబాగం బుధవారంనాడు కార్యాలయానికి సెలవు పెట్టింది. అదే ప్రాంతంలో నివసించే సోదరి కృత్తిక ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి, అక్కడే విశ్రాంతి తీసుకోవాల్సిందిగా తండ్రి ఆమెకు సలహా ఇచ్చాడు.
అయితే, ఆమె సోదరి ఇంటికి వెళ్లలేదు. దీంతో తండ్రి ఆమెను చూడడానికి ఇంటికి వచ్చాడు. ఆమె మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ అతనికి కనిపించింది.
సమాచారం అందుకున్న సెలైయూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని క్రోమేపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.