వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిగత విషయాలడగటం అంత మంచిది కాదు: ప్రీతి జింటా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ఓ మహిళా జర్నిలిస్ట్‌పై మండిపడింది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ప్రీతి జింటాను ఆ మహిళా జర్నలిస్ట్ కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

అనంతరం ఆమెతో 'మహిళగా ఉండటానికి ప్రయత్నించు... మంచి జర్నలిస్ట్'గా కాదని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రీతి జింటా అసలు తనపై ఎందుకంతలా మండిపడిందో అర్ధంకాక ఆ మహిళా జర్నలిస్ట్ నిశ్చేష్టురాలైంది.

 Preity Zinta slams scribe, says 'asking personal questions is not cool'

ప్రీతి జింటా, టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్‌తో ఏకంగా సహజీవనం చేస్తోందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బహుశా ఈ వార్తలపై ఆ మహిళా జర్నలిస్ట్ ప్రీతి జింటాను అడిగి ఉండొచ్చు. గతంలో మాజీ ప్రియుడు నెస్ వాడియాతో వివాదం చెలరేగినప్పుడు ప్రీతి చాలా ఒత్తిడికి గురైంది.

ఆ సమయంలో ఈ అందాల భామకు యువరాజ్ సింగ్ ఆపన్నహస్తం అందించాడట. అండగా నిలబడి, ఆత్మస్థైర్యాన్ని నింపాడట. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య బంధం బలపడి, ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. కాగా నెస్ వాడియా తనను వేధించాడని ఆరోపిస్తూ ప్రీతి జింటా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

English summary
Bollywood actress and IPL team owner Preity Zinta on Wednesday slammed a journalist for asking improper questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X