ఉత్తరాంఖడ్ లో బల నిరూపణ కాదు.. రాష్ట్రపతి పాలనే.. : సుప్రీం
ఉత్తరాంఖడ్ హైకోర్డు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. శాసనసభలో ఈ నెల 29న బల నిరూపణ లేదని స్పష్టం చేసిన సుప్రీం ఉత్తరాంఖడ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేపింది. ఉత్తరాంఖడ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం మెట్లెక్కడంతో ఈ తీర్పును వెలువరించింది కోర్టు.
అంతకుముందు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్సందించిన సుప్రీం హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉండగా.. సుప్రీం తాజా తీర్పుతో ఇక బలపరీక్షకి తెర పడ్డట్టే. జస్టిస్ దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

అలాగే కేసుకి సంబంధించి తదుపరి విచారణ మే 3వ తేదీన ఉంటుందని ప్రకటించింది సుప్రీం. వాదనలు వినిపించే క్రమంలో.. కేసుతో రాష్ట్ర సీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన సుప్రీం.. కొంతమంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసినంత మాత్రానా రాష్ట్రపతి పాలన విధిస్తారా..! అంటూ కేంద్రాన్ని నిలదీసింది.
-
Piped gas వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
Menstrual Leave: మహిళలకు పీరియడ్ సెలవులపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! కీలక వ్యాఖ్యలు..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications