ఆలయంలో పూజలు చేస్తూ అర్చకుడి మృతి, తమిళనాడులో ఘటన
చెన్నై: తమిళనాడులో ఓ దేవాలయంలో విషాధం చోటు చేసుకుంది. నమ్మక్కల్లోని ఆలయంలో పూజారి.. దేవుడి మెడలో తులసి మాల వేసి, ఆ తర్వాత హఠాత్తుగా కిందపడి చనిపోయారు. ఆలయంలో నిత్యం పూజలు చేసే అర్చకుడు ఆ దేవుడి పాదాల చెంతే చివరి శ్వాస విడిచినస్థితి!
అర్చకుడు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మెడలో తులసి మాల వేసేందుకు ఉపక్రమించారు. ఈ సమయంలో హఠాత్తుగా కిందపడిపోయారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. పైనుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఐసీయులో వెంటిలెటర్ పైన చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు.












Click it and Unblock the Notifications