ఊబకాయంపై పోరు మొదలెట్టిన ప్రధాని మోదీ... ప్రముఖులు నామినేట్!
ఊబకాయం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఇక ఊబకాయంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరించాలని మీరు ఒక్కొక్కరు పదిమందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.
ఊబకాయంపైప్రధాని మోదీ
దేశంలో ఊబకాయం అతి తీవ్రమైన సమస్యగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయాన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె వాడకాన్ని 10% తగ్గించడంతోపాటు ఈ ఛాలెంజ్ ను మరో పది మందికి అందించాలని సూచించారు.
2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టుగా WHO డేటా వెల్లడించిందన్నారు.

ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధాని మోదీ
ఇది చాలా తీవ్రమైన హెల్త్ ఎమర్జెన్సీ అని పేర్కొన్న మోదీ ఊబకాయం అనేక రకాల సమస్యలకు వ్యాధులకు దారితీస్తుంది అన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసిన మోదీ ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించడం పై అవగాహన విస్తృతం చేయడానికి, తన క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నానని కొందరు ప్రముఖులను నామినేట్ చేశారు.
ప్రధాని నామినేట్ చేసింది వీరినే
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్ లాల్, భోజ్ పురి గాయకుడు నటుడు నిరాహువా హిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలంపిక్ విజేత మను భకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, గాయని శ్రేయ ఘోషల్, ఎంపీ రచయిత్రి సుధా మూర్తి, నటుడు ఆర్ మాధవన్ లను ప్రధాని మోదీ నామినేట్ చేశారు.
ఊబకాయం తగ్గించేందుకు ఉద్యమం మొదలవుతుందా?
వీరు ఒక్కొక్కరు పదిమందిని నామినేట్ చేయాలని ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా ముందుకు సాగాలని మోదీ ఆకాంక్షించారు. మరి ప్రధాని మోదీ కోరినట్టు ఊబకాయం తగ్గించేందుకు ఉద్యమం మొదలవుతుందా.. ఏ మేరకు ఇది సత్ఫలితాలను ఇస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications